జగన్ మంచి మనసే కారణం..: ‘కోడికత్తి’ కేసు నిందితుడు
Send us your feedback to audioarticles@vaarta.com
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మరికొన్ని రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయబోయే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్పోర్టులో జనుపల్లి శ్రీనివాసరావు అనే యువకుడు కోడి కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. నాడు అరెస్ట్ అయిన శ్రీనివాసరావు.. 7 నెలల తర్వాత ఇవాళ ఉదయం రాజమండ్రి జైలు నుంచి విడుదలయ్యాడు. బెయిల్ పత్రాలు అన్నీ సక్రమంగా ఉండటంతో శ్రీనివాసరావును జైలు అధికారులు విడుదల చేశారు.
విడుదల అనంతరం శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "నేను ప్రాణాలతో ఉన్నానంటే దానికి జగనన్నే కారణం. జగన్ది జాలి గుండె. దాడి సమయంలో నన్ను కొట్టకుండా అడ్డుకున్నారు. నేను ప్రాణాలతో ఉండడానికి కారణం జగన్ మంచి మనసే. నేను కావాలని జగన్పై దాడి చేయలేదు.. ఆ రోజు అనుకోకుండా అలా జరిగిపోయింది. నేను నార్కో అనాలసిస్ టెస్ట్ కూడా సిద్ధం. రైతులు, మహిళలు, ఇతర సమస్యల గురించి వైఎస్ జగన్తో మాట్లాడాలనుకున్నాను. నేనొక చెఫ్నని అందుకే ఆరోజు నా దగ్గర మూడు కత్తులు, ఫోర్క్ ఉన్నాయి" అని శ్రీనివాస్ చెప్పుకొచ్చాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.