close
Choose your channels

మీ ఆశీస్సులు చాలు.... ఇంకా గొప్ప కార్యక్రమాలు చేపడతా : జగన్

Saturday, December 21, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మీ ఆశీస్సులు చాలు.... ఇంకా గొప్ప కార్యక్రమాలు చేపడతా : జగన్

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. అనంతపురం జిల్లా ధర్మవరంలో వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించిన ఆయన... నేతలన్నకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. గతంలో సబ్సిడీలు రాక నేతన్నలు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్నా... ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. మన చేనేత పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపు ఉన్నా.... నేతన్నలను పట్టించుకునే పాలకులు లేకుండా పోయారని అన్నారు జగన్. అగ్గిపెట్టెలో చీర నేయడం నుంచి స్వాంత్ర్యోద్యమం వరకు నేతన్నలకు గొప్ప చరిత్ర ఉందన్నారు.

గత ప్రభుత్వం చేనేత రంగాన్ని నిర్వీరం చేసిందని... నేతన్నలకు ఏ కష్టమొచ్చినా మేము ఇక్కడికి వచ్చామని... అప్పటి సర్కార్ చేసిన అన్యాయాలపై నిరాహారదీక్షలు చేశామని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో నాలుగు లక్షల ఉద్యోగాలిచ్చామని... ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు జగన్. జనవరి 9 నాటికి అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతీ తల్లికి రూ. 15 వేలు అందిస్తామన్నారు.

కానీ శత్రువులు ఎలా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారని అన్న జగన్... మీ ఆశీస్సులు, దేవుడి దయే నాకు బలమన్నారు. ఇంతకన్నా గొప్పగా మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటున్నానని అన్నారు జగన్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.