close
Choose your channels

అమ్మ‌వారి స‌న్నిధిలో అతిలోక సుంద‌రి..

Friday, April 15, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

త‌మిళ‌నాడులోని మ‌ధుర మీనాక్షి అమ్మ‌వారు ఆల‌యం ఎంతో ప్ర‌సిద్ది చెందింది. ఈ ఆల‌యానికి సామాన్యులు నుంచి అసామాన్యులు వ‌ర‌కు అంద‌రూ వెళ్లి అమ్మ‌వార్ని ద‌ర్శించుకుంటార‌న్న విష‌యం తెలిసిందే. తెలుగుతెర పై ఎన్నో విభిన్న‌మైన పాత్ర‌లు పోషించి త‌న అందం - అభిన‌యంతో అతిలోక సుంద‌రిగా చెర‌గ‌ని ముద్ర‌వేసిన శ్రీదేవి అమ్మ‌వార్ని ద‌ర్శించుకున్నారు.

ఇంత‌కీ..ఎప్పుడు ద‌ర్శించుకున్నారంటారా..? త‌మిళ కొత్త సంవ‌త్సరం రోజున‌. ఈ విష‌యాన్ని ఈరోజు శ్రీదేవి ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌చేసారు. అమ్మ‌వారి ద‌ర్శ‌నం బాగా జ‌రిగింది. ఆ అమ్మ‌వారి ఆశీర్వాదం పొందిన అనుభూతి క‌లిగింది అంటూ ఆల‌యంలో త‌న స్నేహితురాళ్ల‌తో దిగిన ఫోటోను ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసారు శ్రీదేవి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.