close
Choose your channels

బన్ని సినిమా శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్న

Saturday, February 25, 2017 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా హ‌రీష్ శంక‌ర్.ఎస్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం `డిజె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌`. ఆర్య‌, ప‌రుగు చిత్రాలు త‌ర్వాత బ‌న్ని, దిల్ రాజు కాంబినేష‌న్‌లో వ‌స్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. శివ‌రాత్రి సంద‌ర్బంగా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్ సెన్సేష‌న్ క్రియేట్ చేస్తూ మూడు మిలియ‌న్స్ దిశ‌గా వెళుతుంది.

సినిమా విడుద‌ల తేదిని ప్ర‌క‌టించ‌క ముందుగానే సినిమాపై మంచి క్రేజ్ క్రియేట్ అయ్యింది. అన్నీ ఏరియాస్ నుండి డిస్ట్రిబ్యూట‌ర్స్ దిల్‌రాజును సంప్ర‌దిస్తున్నారు. మ‌రోవైపు ఈ సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను జీ తెలుగు ఛానెల్ రికార్డ్ ప్రైజ్‌కు సొంతం చేసుకుంద‌ట‌. స‌రైనోడు సినిమా శాటిలైట్ హ‌క్కులు 16 కోట్ల‌కు అమ్ముడ‌య్యాయి. డిజె దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ హ‌క్కులు స‌రైనోడు కంటే ఎక్కువ ధ‌ర‌కే అమ్ముడైన‌ట్లు స‌మాచారం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.