close
Choose your channels

గుంటూరు టాకీస్ బ్యానర్ ద్వారా...'21st సెంచరీ లవ్' రిలీజ్

Saturday, June 11, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

స్నేహమా - ప్రేమ- ఆకర్షణ వీటి మాయలో పడి నేటి యువత ఏలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారన్న ఆసక్తి కరమైన కధాశంతో యువ దర్శకడు గోపినాథ్ "21st సెంచరీ లవ్ " సినిమాను రూపొందించారు. BRSI మూవీస్ పతాకంపై పొల్కంపల్లి నరేందర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. గోపినాథ్, విష్ణుప్రియ జంటగా, పృధ్వీ, వేణు, సుమన్ శెట్టి, చిత్రం శీను ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్బంగా గోపినాధ్ మాట్లాడుతూ.. సినిమా ఫస్ట్ కాపీ సిధ్దమయింది. పలువురు సినీ ప్రముఖులు మా సినిమాను చూసి అభినందిచటం జరిగింది.స్వయానా గుంటూర్ టాకీస్ చిత్ర నిర్మాత రాజ్ కుమార్ తమ ఆర్.కె స్డూడియోస్ ద్వారా మా చిత్రాన్ని త్వరలొనె విడుదల చేయనున్నారు. నేటి యువతరాన్ని మా సినిమా 100% ఆకట్టు కుంటుందన్నారు..
ఆర్.కె .స్డూడియోస్ అథినేత రాజ్ కుమార్ మాట్లాడుతూ.. గుంటూర్ టాకీస్ కమర్షియల్ సక్సెస్ తర్వాత మళ్లీ అదె తరహాలో ఓ ఎంటర్ టైనింగ్ మూవీని ఆడియెన్స్ ముందుకు తీసుకు వస్తున్నాము.21st సెంచరీ లవ్ సైతం యూత్ కు బాగా నచ్చె సినిమా అవుతుంది. దర్శకుడు గోపినాధ్ ఆసక్తి కరంగా ఈ సినిమాను తీశారన్నారు..

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.