close
Choose your channels

27న అవతారం

Tuesday, February 11, 2014 • Telugu Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అరుంధతి సినిమా తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అవతారం. రాధికా కుమారస్వామి, రిషి, భానుప్రియ, అన్నపూర్ణ కీలక పాత్రధారులు. ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించారు. యం.యుగంధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. అరుంధతి ఆర్ట్ ఫిలిమ్స్ పతాకంపై తెరకెక్కుతోంది. ఈ సినిమా ట్రైలర్ మంగళవారం హైదరాబాద్ లో విడుదలైంది.

ఈ సినిమాను ఈ నెల 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కేరళలోని పాలక్కాడులో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దుష్ట శక్తులకు, ఓ మహిళకు జరిగిన పోరాటం ప్రధానంగా రూపొందించారు. గ్రాఫిక్స్ కు ప్రధానమైన స్థానం ఉన్న సినిమా ఇది. సౌందర్య లేని లోటును రాధికా కుమారస్వామి భర్తీ చేస్తుందని కోడి రామకృష్ణ అన్నారు. తన తల్లి పేరు మీద బ్యానర్ పెట్టినట్టు నిర్మాత చెప్పారు.

Follow us on Google News and stay updated with the latest!