భక్తిఛానెల్ ఛైర్మన్గా థర్టీ ఇయర్స్ పృథ్వీ
Send us your feedback to audioarticles@vaarta.com
థర్టీ ఇయర్స్ ఇక్కడ... అంటూ పృథ్వీ చేసే కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పనకర్లేదు. ప్రేక్షకుల్లో తనకంటూ థర్టీ ఇయర్స్ పృథ్వీగా ఈయన ఓ గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పృథ్వీ వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పార్టీకి తనవంతు సేవలను అందించారు. ఇప్పుడు వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. పార్టీ పరంగా మద్దతు చేసిన పృథ్వీకి జగన్ కీలక పదవినిచ్చారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ చైర్మన్గా పృథ్వీని నియమించారు జగన్. పృథ్వీకి ముందు ప్రముఖ సీనియర్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు భక్తి ఛానెల్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. వైసీపీ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించగానే ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.