close
Choose your channels

‘మహాసముద్రం’లో మధ్య తరగతి అమ్మాయిగా అదితి..

Monday, October 12, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘మహాసముద్రం’లో మధ్య తరగతి అమ్మాయిగా అదితి..

‘సమ్మోహనం’తో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అదితిరావు హైదరీ మరో తెలుగు సినిమాలో కనిపించనుంది. ‘ఆర్ఎక్స్ 100’ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. సిద్దార్థ్, శర్వానంద్ హీరోలుగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘మహాసముద్రం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో అదితి.. ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిగా నటించనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు అదితి పాత్ర చాలా కీలకమని సమాచారం.

ఇప్పటికే అదితిరావు హైదరికి అజయ్ భూపతి కథను చెప్పడం ఆమె దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగిపోయింది. ఈ విషయమై చిత్ర దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ.. ‘‘అది ఒక చాలెంజింగ్ రోల్ అని.. ఆ పాత్రకు అదితి వన్నె తీసుకువస్తుంది. ఇప్పటి వరకూ కనిపించని.. పాత్రలో అదితి కనిపించబోతోంది. స్టోరీ వినగానే ఆమె చాలా ఎగ్జైట్ అయింది. వెంటనే సినిమాకు ఓకే చెప్పేసింది’’ అని అజయ్ భూపతి వెల్లడించారు.

కాగా.. ఇంతకు మించి ప్రస్తుతానికి తాను అదితి పాత్ర గురించి చెప్పలేనని అజయ్ భూపతి పేర్కొన్నారు. స్క్రిప్ట్‌ను పక్కనబెడితే అదితి తన పాత్రను డిజైన్ చేసిన తీరును బాగా ఇష్టపడిందని ఆయన వెల్లడించారు. అదితి పాత్ర చాలా ఎమోషన్‌తో కూడుకుని ఉంటుందని తెలిపారు. శర్వా, సిద్దార్థ్‌ల మల్టీ స్టారర్ అనగానే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. చాలా గ్యాప్ తర్వాత తిరిగి సిద్ధార్థ్ తెలుగు తెరపై కనిపించనున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రి ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుని పట్టాలెక్కనుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.