close
Choose your channels

అడ‌వి శేష్ తో అభిషేక్ పిక్చ‌ర్స్..

Saturday, April 2, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

క్ష‌ణం సినిమాలో హీరోగా న‌టించ‌డంతో పాటు క‌థ - స్ర్కీన్ ప్లే అందించిన మ‌ల్టీటాలెంటెడ్ ప‌ర్స‌న్ అడ‌వి శేష్. క్ష‌ణం సినిమాకి ముందు బాహుబ‌లి, పంజా, కిస్, క‌ర్మ‌ చిత్రాల్లో న‌టించినా...అడ‌వి శేష్ కి హీరోగా స‌క్సెస్ అందించింది మాత్రం క్ష‌ణం చిత్రం. ఈ సినిమా ఇచ్చిన విజ‌యంతో ఫుల్ బిజీ అయిపోయాడు శేష్. తాజాగా అభిషేక్ పిక్చ‌ర్స్ అడ‌వి శేష్ తో రెండు సినిమాలు ప్లాన్ చేస్తుంది.

ఈ సంద‌ర్భంగా అడ‌వి శేష్ స్పందిస్తూ...క్ష‌ణం తర్వాత అభిషేక్ పిక్చ‌ర్స్ తో క‌ల‌సి రెండు చిత్రాలు చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ రెండు చిత్రాల్లో హీరోగానే న‌టిస్తున్నాను. డైరెక్ష‌న్ చేయ‌డం లేదు. ప్ర‌స్తుతం క‌ధా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ఇంకా క‌థ ఏమిటి..? డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నేది ఫైన‌ల్ కాలేదు. త్వ‌ర‌లోనే పూర్తి వివ‌రాలు తెలియ‌చేస్తాను. అభిషేక్ పిక్చ‌ర్స్ తో చేసే రెండు సినిమాల్లో ఒక సినిమా ఈ సంవ‌త్స‌రంలోనే రిలీజ్ అవుతుంద‌ని ఆశిస్తున్నాను అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.