close
Choose your channels

విశాఖలో టీడీపీకి షాక్.. పార్టీని వీడనున్న మరో ఎమ్మెల్యే..

Saturday, September 19, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

విశాఖలో టీడీపీకి షాక్.. పార్టీని వీడనున్న మరో ఎమ్మెల్యే..

ఏపీలో ప్రతిపక్ష టీడీపీకి మరో ఎదురుదెబ్బ తగలనుంది. మరో ఎమ్మెల్యే టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవలి కాలం వరకూ ఆయన టీడీపీకి సంబంధించిన కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉంటూనే వస్తున్నారు. అయితే అకస్మాత్తుగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు శనివారం ఆయన వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్‌రెడ్డిని కలవనున్నారు.

ఇప్పటికే టీడీపీకి ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి దూరమైన విషయం తెలిసిందే. వైసీపీలో వారు చేరకున్నప్పటికీ ఆ పార్టీకి మాత్రం మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పుడు అదే బాటలో వాసుపల్లి గణేష్ కూడా నడవనున్నారు. వాసుపల్లి గణేష్ అధికారికంగా వైసీపీలో చేరకున్నా.. ఆయన ఆ పార్టీకి మద్దతుగా నిలవనున్నట్టు సమాచారం. అసెంబ్లీలో ఎలాంటి సమస్యలూ ఎదురు కాకుండా టీడీపీని వీడాలనుకున్న ఎమ్మెల్యేలంతా వైసీపీలో చేరకుండా ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.