డిజిటల్ మాధ్యమంలోకి 'బాహుబలి' నిర్మాతలు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలుగు సినిమాకు `బాహుబలి` చిత్రంతో అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. ఈ సినిమాను నాలుగు వందల కోట్ల బడ్జెట్తో నిర్మించిన నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని అందరి మన్ననలు పొందారు. ఇప్పుడు ఆర్కామీడియా అధినేత అయిన శోభు యార్లగడ్డ సినిమా కంటే ఎక్కువగా డిజిటల్ మాధ్యమంపై ఎక్కువగా ఫోకస్ పెట్టారట. ప్రస్తుతం సోషల్ మీడియా పెరిగిన నేపథ్యంలో పలు సంస్థలు డిజిటల్గా రంగంలో రాణించే ప్రయత్నం చేస్తున్నాయి.
ఇప్పుడు శోభు కూడా అదే ఆలోచనలో ఉన్నారట. రెండేళ్లలో సినిమాల కంటే డిజిటల్ రంగంలోనే ఎక్కువ డబ్బుల సంపాదించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. ఓ ఆఫీస్ను సిద్ధం చేసి డిజిటల్ మాధ్యమానికి సరిపడేలా కంటెంట్ను సిద్ధం చేస్తున్నారట. ఇందులో మంచి కంటెంట్ను ఓకే చేసి దానికి ఫండింగ్ చేసి అవుట్పుట్ తయారు చేసి డిజిటల్కు మంచి రేటుకు ఇచ్చేస్తారట. ఏదేమైనా శోభు యార్లగడ్డ బిజినెస్ మైండ్ చాలా ఫాస్ట్గా ఉంది కదా!
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.