close
Choose your channels

ఎట్టకేలకు ఆ హీరోయిన్‌కి బెయిల్‌ దొరికింది

Saturday, December 12, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఎట్టకేలకు ఆ హీరోయిన్‌కి బెయిల్‌ దొరికింది

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో వెలుగు చూసిన డ్రగ్స్‌ కోణంపై విచారణ చేపట్టిన నార్కోటిక్‌ అధికారులు సినీ రంగానికి చెందిన చాలా మందిని విచారించారు. రియా చక్రవర్తి, ఆమె సోదరుడు సహా కన్నడ సినీ రంగానికి చెందిన సంజనా గల్రాని, రాగిణీ ద్వివేదిని అరెస్ట్‌ చేశారు.

అప్పటి నుండి వీరిద్దరూ బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. కానీ వీరు బయటకు వస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశం ఉందని భావించిన కోర్టు బెయిల్‌ను నిరాకరిస్తూ వస్తుంది. అయితే గత నెలలో సంజా తన అనారోగ్య సమస్యలను కారణంగా చూపి మరోసారి బెయిల్‌ పిటిషన్‌ పెట్టుకుంది. ఎట్టకేలకు కోర్టు ఇప్పుడు సంజనాకు షరుతులతో కూడిన బెయిల్‌ను ఇచ్చింది.

కండీషన్స్‌లో భాగంగా ప్రతి నెల రెండుసార్లు కోర్టుకు హాజరు కావాలని, విచారణకు పిలిస్తే వెళ్లాలని.. సాక్ష్యులను ప్రభావితం చేస్తే బెయిల్ రద్దు అవుతుందని కోర్టు పేర్కొంది. బెయిల్‌ మంజూరు చేయడానికి ఇద్దరు వ్యక్తలు పూచీకత్తుతో పాటు మూడు లక్షల రూపాయల బాండ్‌ను సమర్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

బాలీవుడ్ యువ క‌థానాయ‌కుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ అనుమానాస్ప‌ద మృతి కేసును సీబీఐకి అప్ప‌గించిన నేప‌థ్యంలో వారు రియా వాట్సాప్ చాట్‌ను ప‌రిశీలించింది. అందులో డ్ర‌గ్స్‌కు సంబంధించిన సంభాష‌ణ ఉండ‌టంతో ఈ కేసులో డ్ర‌గ్స్ కుంభ‌కోణం బ‌య‌ట‌ప‌డింది. దీంతో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగి విచార‌ణ చేయ‌డం ప్రారంభించింది. రియా, ఆమె సోద‌రుడు షోవిక్ త‌దిత‌రుల‌ను ఎన్‌సీబీ విచార‌ణ చేసి అదుపులోకి తీసుకుంది. పలువురు బాలీవుడ్ ఆర్టిస్టులను కూడా ఎన్‌సీబీ విచారించింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.