విజయనిర్మల మృతి చిత్రసీమకు తీరనిలోటు: బాలయ్య
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ నటి విజయనిర్మల మృతి చిత్రసీమకు తీరనిలోటు అని హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పుకొచ్చారు. విజయనిర్మల ఇకలేరన్న వార్త విన్న బాలయ్య తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ సందర్భంగా నందమూరి కుటుంబంతో విజయనిర్మలకు ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు.
బాలయ్య మాటల్లోనే...
"నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా తనదైన ప్రత్యేకతను సంపాదించుకున్న విజయనిర్మల గారు కన్నుమూయడం ఎంతో బాధాకరం. సినీ రంగ పరిశ్రమలో మహిళా సాధికారతను చాటిన అతి కొద్ది మంది మహిళల్లో విజయనిర్మలగారు ఒకరు. నాన్నగారి ‘పాండురంగ మహత్యం’ సినిమాలో కృష్ణుడిగా నటించారు. అదే ఆవిడ నటించిన తొలి తెలుగు సినిమా. బాలనటి నుండి హీరోయిన్గా కూడా ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించారు. నాన్నగారితో ‘మారిన మనిషి’, ‘పెత్తందార్లు’, ‘నిండుదంపతులు’, ‘విచిత్రకుటుంబం’ సినిమాల్లో నటించారు. అలాగే దర్శకురాలిగా 44 చిత్రాలను డైరెక్ట్ చేయడం చాలా గొప్ప విషయం. దర్శకురాలిగా గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించి ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు. ఆమె మృతి చిత్రసీమకు తీరనిలోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను" అని నందమూరి బాలయ్య ఓ ప్రకటనలో తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.