close
Choose your channels

వీపుపై కొట్టండి.. దయచేసి కడుపుపై కొట్టకండి: బండ్ల గణేష్ ఆవేదన

Sunday, October 11, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వీపుపై కొట్టండి.. దయచేసి కడుపుపై కొట్టకండి: బండ్ల గణేష్ ఆవేదన

2018 ఎన్నికల సమయంలో రాజకీయ ఆరంగేట్రం చేసిన నిర్మాత బండ్ల గణేష్.. అమాయకంగా మీడియాకు దొరికిపోయారు. దీంతో నెటిజన్లు ఆయనను ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. ఆయనపై వచ్చిన ట్రోల్స్, మీమ్స్ అన్నీ ఇన్నీ కావు. దీంతో బండ్ల గణేష్ రాజకీయాలకు స్వస్తి చెప్పారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కరోనా తొలుత ఆయనకే ఎఫెక్ట్ అయ్యింది. అప్పటి నుంచి తనలో చాలా మార్పు వచ్చిందని గణేష్ ఇటీవల ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

అంతేకాదు.. తన కారణంగా ఎవరైనా బాధపడి ఉంటే క్షమించమని కోరారు. అప్పటి నుంచి పాజిటివ్ యాటిట్యూడ్‌తో వెళుతున్న బండ్ల గణేష్ కొద్ది రోజుల క్రితం ఓ ట్వీట్ చేశారు. తన దేవుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ని కలిశానని.. ఆయన ఓకే చెప్పారని.. చాలా సంతోషంగా ఉన్నానంటూ ట్వీట్ చేశారు. ఇంకేముంది.. మరో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ రాబోతోందంటూ అభిమానులు సంతోషించారు. ట్విట్టర్ వేదికగా పవన్ అభిమానులు బండ్లకు శుభాకాంక్షలు తెలిపారు.

అంత సంతోషంగా ట్వీట్ చేసిన బండ్ల గణేష్ సడెన్‌గా తాజాగా మరో ట్వీట్ చేశారు. ''వీపు మీద కొట్టండి. కానీ దయ చేసి కడుపు మీద కొట్టకండి ......ఇది నా విన్నపం. నా మీద దయచేసి ఏ విధమైన వార్తలు రాయొద్దు నేను చెప్పే వరకు ఇది నా అభ్యర్థన.." అని ఆవేదనతో బండ్ల గణేష్‌ ట్వీట్‌‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. మరి ఈ ట్వీట్ ఎందుకు చేయాల్సి వచ్చిందన్న విషయం మాత్రం తెలియలేదు. ఈ ట్వీట్ పవన్, బండ్ల గణేష్ కాంబినేషన్‌కు సంబంధించిందే అయి ఉంటుందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.