close
Choose your channels

80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న 'బంతిపూల జానకి'

Tuesday, March 1, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ధన్ రాజ్, దీక్షాపంత్, షకలక శంకర్, అదుర్స్ రఘు, వేణు, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, సుడిగాలి సుదీర్ ముఖ్య తారాగణంగా రూపొందుతున్న చిత్రం ""బంతిపూల జానకి". హాస్యానికి పెద్ద పీట వేస్తూ "ఆద్యంతం అత్యంత ఉత్కంఠభరితం" అనిపించేలా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఉజ్వల క్రియేషన్స్ పతాకంపై కళ్యాణిరామ్ నిర్మిస్తున్నారు. నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దర్సకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికి 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకొంది.
ఈ సందర్భంగా దర్శకుడు నెల్లుట్ల ప్రవీణ్ చందర్ మాట్లాడుతూ.. "ఆర్టిస్టులు మరియు సాంకేతిక నిపుణులందరి సహాయ సహకారాలతో కామెడి థ్రిల్లర్ గా రూపొందుతున్న "బంతిపూల జానకి" చిత్రం షూటింగ్ 80 శాతం పూర్తి చేశాం. అవుట్ పుట్ చాలా సంతృప్తిగా వస్తోంది. 2016లో ఘన విజయం సాధించబోయే చిన్న చిత్రాల జాబితాలో "బంతిపూల జానకి" తప్పక స్థానం సంపాదించుకుంటుంది. త్వరలో జరిగే చివరి షెడ్యూల్ లో ఒక పాటతోపాటు మిగిలిన టాకీ పార్ట్ కంప్లీట్ చేస్తాం" అన్నారు.
డాక్టర్ భరత్ రెడ్డి, ఫణి, కోమలి, జీవన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్: శివ వై.ప్రసాద్, కెమెరా: జి.ఎల్.బాబు, కథ-మాటలు: శేఖర్ విఖ్యాత్, సంగీతం: బోలె, నిర్మాత: కళ్యాణిరామ్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చందర్!!

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.