close
Choose your channels

Amitabh Bachchan : ప్రాజెక్ట్ కే షూటింగ్‌లో ప్రమాదం.. అమితాబ్‌కు తీవ్ర గాయాలు, ముంబైలో చికిత్స

Monday, March 6, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ఇటీవలి కాలంలో సినిమా షూటింగుల్లో పలువురు హీరోలు, హీరోయిన్లు ప్రమాదాల బారినపడిన సంగతి తెలిసిందే. నిన్న గాక మొన్న తమిళ స్టార్ హీరో విశాల్ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు.ప్రస్తుతం విశాల్ మార్క్ ఆంటోనీ సినిమా చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌లో భాగంగా ఓ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్నారు. దీని కోసం ఓ భారీ ట్రక్కును చిత్ర యూనిట్ వినియోగిస్తోంది. అయితే షూట్ సమయంలో ఆ ట్రక్కు అదుపు తప్పి స్టూడియోలో వున్న సెట్టింగ్స్‌ను ధ్వంసం చేసుకుంటూ దూసుకొచ్చింది. ఆ సమయంలో లోపల 100 మందికి పైగా కార్మికులు, సాంకేతిక నిపుణులు, హీరో విశాల్ కూడా వున్నారు. అయితే ట్రక్ రాకను గమనించిన యూనిట్ సభ్యులు విశాల్‌ను వెంటనే పక్కకు లాగారు. దీంతో ఆయన పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు.

ప్రాజెక్ట్ కే షూటింగ్‌లో గాయపడ్డా అమితాబ్ :

తాజాగా బాలీవుడ్ సూపర్‌స్టార్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కూడా షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. ప్రభాస్ హీరోగా మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘‘ప్రాజెక్ట్ కే’’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తుండగా బిగ్ బీ ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. పక్కటెముక మృదలాస్థి విరగడంతో పాటు కుడి పక్కటెముక కండరం చిరిగిపోయిందని అమితాబ్ తన బ్లాగర్ ద్వారా వెల్లడించారు. దీంతో షూటింగ్ రద్దు చేసుకుని హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నట్లు బిగ్‌బీ వెల్లడించారు. షూటింగ్‌లు, ఇతర పనులను వాయిదా వేసి ముంబైలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నానని అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు. ఆయన గాయపడిన నేపథ్యంలో యూనిట్ సభ్యులు తీవ్ర భయాందోళనలకు గురైనట్లు తెలుస్తోంది. మరోవైపు అమితాబ్ గాయపడిన విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

2024 సంక్రాంతి కానుకగా ప్రాజెక్ట్ కే :

ఇకపోతే.. ప్రాజెక్ట్‌కే ను వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వీనిదత్ భారీ బడ్జెట్‌తో ప్రాజెక్ట్ కేను నిర్మిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, దీపీకా పదుకొనే, దిశా పటానీ తదితర స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పటి వరకు తెలుగు తెరపై కనిపించని కొత్త కథతో ఈసినిమాను తెరకెక్కిస్తున్నట్లు నాగ్ అశ్విన్ తెలిపారు. ప్రాజెక్ట్‌ను రెండు పార్ట్‌లుగా విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది. తొలి భాగాన్ని 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.