బాలీవుడ్ రీమేక్ యోచన...
Send us your feedback to audioarticles@vaarta.com
ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ అధినేత అనీల్ సుంకర త్వరలోనే ఓ బాలీవుడ్ సినిమాను తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
వివరాల్లోకెళ్తే.. బాలీవుడ్లో ఫన్ రైడర్గా విజయాన్ని సాధించిన 'షాదీ మే జరూర్ ఆనా!' చిత్రానికి సంబంధించిన రీమేక్ హక్కులను అనీల్ సుంకర సొంతం చేసుకున్నారు. రాజ్కుమార్ రావ్, కృతి కర్బందా హీరో హీరోయిన్గా నటించారు.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. ప్రముఖ హీరో, హీరోయిన్ జంటగా నటించబోతున్నారని వినికిడి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.