close
Choose your channels

NDA: ఎట్టకేలకు ఎన్డీఏలోకి తెలుగుదేశం.. బీజేపీ పెద్దలతో ఫలించిన చర్చలు..

Friday, March 8, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

NDA: ఎట్టకేలకు ఎన్డీఏలోకి తెలుగుదేశం.. బీజేపీ పెద్దలతో ఫలించిన చర్చలు..

ఎట్టకేలకు ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ చేరడం ఖాయమైంది. ఊహించినట్లుగానే 2014 ఎన్నికల సీన్ రిపీట్ కానుంది. తెలుగుదేశం-జనసేన-బీజేపీ కలిసి ఎన్నికల బరిలో దిగనున్నాయి. ఇప్పటికే టీడీపీ-జనసేన పొత్తు కట్టగా.. ఇప్పుడు కమలం పార్టీ కూడా జత కట్టనుంది. గురువారం రాత్రి ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర సేపు వారితో సమావేశమయ్యారు. పొత్తు ఖాయమవ్వడంతో సీట్లు సర్దుబాటుపై చర్చలు జరిపారు.

ఈ ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లు గెలవాలనే లక్ష్యంగా బీజేపీ పెట్టుకోవడంతో పాత మిత్రులను మళ్లీ కలుపుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే బీహార్‌లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ, ఉత్తరప్రదేశ్‌లో జయంత్ చౌదరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్, కర్ణాటకలో జేడీఎస్ పార్టీలను ఎన్డీఏలోకి చేర్చుకున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాల రాష్ట్రాల నుంచి తెలుగుదేశం పార్టీ, నవీన్‌ పట్నాయక్‌ నేతృత్వంలోని బిజూ జనతాదళ్‌ను కూడా చేర్చుకునేందుకు కమలం పెద్దలు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే చంద్రబాబుతో చర్చలు జరిపారు.

NDA: ఎట్టకేలకు ఎన్డీఏలోకి తెలుగుదేశం.. బీజేపీ పెద్దలతో ఫలించిన చర్చలు..

ఈ చర్చల్లో బీజేపీ పెద్దలు 10 ఎంపీ సీట్లను అడిగినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు 4 లేదా 5 ఎంపీ స్థానాలు ఇచ్చేందుకు అంగీకరించినట్లు సమాచారం. శుక్రవారం మరోసారి కేంద్ర పెద్దలతో భేటీ అయి సీట్ల సర్దుబాటును ఫైనల్ చేయనన్నారు. అనంతరం ఉమ్మడిగా పొత్తు ప్రటకన చేయనున్నారట. మొత్తమ్మీద బీజేపీకి 5 లోక్‌సభ, 6 అసెంబ్లీ సీట్లను కేటాయించనున్నట్లు సమాచారం.

NDA: ఎట్టకేలకు ఎన్డీఏలోకి తెలుగుదేశం.. బీజేపీ పెద్దలతో ఫలించిన చర్చలు..

ఇక 175 అసెంబ్లీ సీట్లలో జనసేన, బీజేపీ కలిసి 30 స్థానాలలో పోటీ చేయనున్నాయి. 25 పార్లమెంట్‌ సీట్లలో 8 సీట్లలో ఈ రెండు పార్టీలు పోటీ చేస్తే... మిగిలిన 17 స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. జనసేనకు ఇప్పటికే అనకాపల్లి, కాకినాడ, మచిలీపట్నం ఎంపీ స్థానాలు కేటాయించారు. మిగిలిన 5 స్థానాల్లో అరకు, రాజమండ్రి, నరసాపురం, తిరుపతి, రాజంపేట ఎంపీ స్థానాలను బీజేపీకి ఇవ్వనున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ సీట్ల విషయానికి వస్తే.. విశాఖ ఉత్తరం, నర్సాపురం, ధర్మవరం, జమ్మలమడుగు, తిరుపతి, కైకలూరు స్థానాలు ఉన్నాయి.

కాగా 2014లో కలిసి పోటీ చేసిన మూడు పార్టీలు వివిధ కారణాల వల్ల విడిపోయాయి. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై పోరాటంతో ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది. అనంతరం జనసేన కూడా టీడీపీకి దూరమైంది. ఈ నేపథ్యంలోనే 2019 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసి ఘోర పరాజయం చవిచూశాయి. దీంతో కేంద్రంలోని బీజేపీతో కలిసేందుకు చంద్రబాబు-పవన్ ప్రయత్నాలు ప్రారంభించారు. ముందుగా జనసేన పార్టీ తిరిగి ఎన్డీఏలోకి చేరింది. అయితే చంద్రబాబు కూడా ఎన్డీఏలో చేరేందుకు తన వంతు ప్రయత్నాలు చేశారు. మొత్తానికి చంద్రబాబు-పవన్ ప్రయత్నాలు ఫలించాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.