close
Choose your channels

చిరు 153 డైరెక్టర్ మారుతున్నాడా?

Thursday, July 16, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చిరు 153 డైరెక్టర్ మారుతున్నాడా?

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తన 152వ చిత్రం ‘ఆచార్య’చిత్రీకరణను పూర్తి చేయడానికి రెడీగా ఉన్నారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత చిత్రీకరణను షురూ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. మరో పక్క చిరంజీవి 153వ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మలయాళ సూపర్‌హిట్ మూవీ లూసిఫర్ రీమేక్‌లో చిరంజీవి నటిస్తారనే సంగతి తెలిసిందే. ఈ చిత్రం పనులను ఊపందుకున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన వార్తొకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అదేంటంటే.. ఈ సినిమా డైరెక్టర్ మారబోతున్నాడని. ముందుగా రన్ రాజా రన్, సాహో చిత్రాల దర్శకుడు సుజిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాడని అందరూ అనుకున్నారు. చిరంజీవి కూడా ఇదే విషయాన్ని ఓ సందర్భంలో తెలిపారు. సుజిత్ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడని, మే నెలలోనే స్ర్కిప్ట్ ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉందని అనుకున్నారు.

అయితే సడెన్‌గా ఇప్పుడు డైరెక్టర్ మారుతున్నాడని, సుజిత్ స్థానంలో వి.వి.వినాయక్ మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో చిరంజీవితో ఠాగూర్, చిరు రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 చిత్రాలను డైరెక్ట్ చేసిన వినాయక్ ఇప్పుడు సీన్‌లోకి రావడం వెనుక రీజన్స్ ఏంటో తెలియడం లేదు. గతంలో వినాయక్ చిరంజీవిని ప్రెజెంట్ చేసిన తీరు నచ్చి చిరంజీవి మళ్లీ వినాయక్ వైపు మొగ్గు చూపి ఉండవచ్చునని అనుకుంటున్నారు. అదీగాక వినాయక్ ప్రస్తుతం సినిమాలను డైరెక్ట్ చేయడం లేదు. మరి ఈ విషయం చివరకు ఎలాంటి మలుపులను తీసుకుంటుందో వేచి చూడాలి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos