మల్టీస్టారర్ రీమేక్పై క్లారిటీ...
Send us your feedback to audioarticles@vaarta.com
తమిళంలో విజయవంతమైన `విక్రమ్ వేద` చిత్రాన్ని తెలుగులో, హిందీలో రీమేక్ చేయాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. ఓ గ్యాంగ్స్టర్, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఆఫీసర్కి మధ్య జరిగిన డ్రామానే ఈ చిత్రం. పోలీస్ ఆఫీసర్గా మాధవన్ నటిస్తే... గ్యాంగ్స్టర్గా విజయ్ సేతుపతి నటించారు.
రీసెంట్గా ఈ మల్టీస్టారర్ను తెలుగులో నందమూరి బాలకృష్ణ, డా.రాజశేఖర్లతో రూపొందిస్తారని వార్తలు వినిపించాయి. అయితే రీమేక్ హక్కులను సొంతం చేసుకున్న వై నాట్ స్టూడియోస్ సంస్థ అలాంటిదేమీ లేదు అంటూ అధికారిక ప్రకటనను వెలువరించింది. ప్రస్తుతం ఎన్నికల్లో బిజీగా ఉన్న బాలకృష్ణ తదుపరి.. బోయపాటి శ్రీను కాంబినేషన్లో సినిమా చేయడానికి సన్నద్ధమవుతున్నారట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.