close
Choose your channels

మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. న్యూయార్క్‌ గవర్నర్ కీలక నిర్ణయం

Thursday, November 12, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే పలు దేశాల్లో కరోనా మరోమారు తిరిగి విజృంభిస్తోంది. అమెరికాలో కూడా సెకండ్ వేవ్ స్టార్ట్ అయిపోయింది. ఇటీవల అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇది కూడా కరోనా విజృంభణకు ఒక కారణమైంది. కాగా.. అమెరికా దేశంలోని న్యూయార్కు రాష్ట్రంలో కరోనా సంక్రమణ రేటు 3 శాతానికి చేరుకుంది. దీంతో న్యూయార్క్ గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసుల సంఖ్య పెరగడంతో రాత్రి 10 గంటలకు బార్‌లు, రెస్టారెంట్లు, జిమ్‌లు మూసివేయాలని గవర్నర్ ఆండ్రూ క్యూమో ఆదేశాలు జారీ చేశారు.

అలాగే న్యూయార్క్‌లో కొవిడ్-19 మహమ్మారి ప్రబలుతున్న దృష్ట్యా ఇన్ డోర్, అవుట్ డోర్ సమావేశాల్లో 10 మందికి పరిమితం చేయాలని ఆండ్రూ క్యూమో ఆదేశాలు జారీ చేశారు. నవంబరు 13వతేదీ నుంచి స్టేట్ లిక్కర్ అథారిటీ జారీ చేసిన లైసెన్సులున్న బార్‌లతో పాటు జిమ్‌లను రాత్రి 10 గంటలకల్లా మూసివేయాలని గవర్నరు ఆదేశించారు. రెస్టారెంట్లు, బార్‌లలో సైతం రాత్రి 10 గంటల తర్వాత మద్యం కాకుండా ఆహారం మాత్రం డెలివరీ చేసేందుకు అనుమతించినట్లు క్యూమో చెప్పారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.