close
Choose your channels

'మ‌హ‌ర్షి' కి ఉప రాష్ట్ర‌ప‌తి ప్ర‌శంస‌లు

Wednesday, May 15, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మ‌హ‌ర్షి కి ఉప రాష్ట్ర‌ప‌తి ప్ర‌శంస‌లు

``రైతుకు కావాల్సింది జాలీ కాదు.. మ‌ర్యాద‌. రైతును కాపాడుకోవాల్సిన బాధ్య‌త మ‌న అంద‌రిదీ`` అనే పాయింట్‌ను ఆధారంగా చేసుకుని తెర‌కెక్కిన చిత్రం `మ‌హ‌ర్షి`.  వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రం చాలా పెద్ద విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ను సాధించిన ఈ చిత్రంపై ప్ర‌ముఖులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఇప్పుడు ఉప రాష్ట్ర‌ప‌తి ఎం.వెంక‌య్య నాయుడు `మ‌హ‌ర్షి` సినిమా చూసి ట్విట్ట‌ర్ వేదిక స్పందించారు. 

``కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు ‘మహర్షి’ చిత్రాన్ని చూడడం జరిగింది. గ్రామీణ ఇతివృత్తంతో, వ్యవసాయ పరిరక్షణను, అన్నదాతలకు అండగా నిలబడాల్సిన ఆవశ్యకతను తెలియజేసిన ప్రబోధాత్మక చిత్రం. ప్రతి ఒక్కరూ చూడదగిన మంచి సినిమా.

గ్రామీణ ప్రజల సౌభాగ్యాన్ని, వ్యవసాయ ప్రాధాన్యతను గుర్తుకు తెచ్చిన చిత్రం ‘మహర్షి’. సహజమైన చక్కని నటన కనబరిచిన కథానాయకుడు శ్రీ మహేష్ బాబు, చక్కగా చిత్రీకరించిన దర్శకుడు శ్రీ వంశీ పైడిపల్లి, నిర్మాతలతో పాటు చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నాను` అని తెలిపారు ఉప రాష్ట్ర‌ప‌తి. 

ఉప‌రాష్ట్ర‌ప‌తి ట్వీట్‌కు సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌, ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి స్పందించారు. మా సినిమాకు ద‌క్కిన గొప్ప గౌర‌వమిది. మీ ప్ర‌శంస మాపై మ‌రింత బాధ్య‌త‌ను పెంచింది`` అని వంశీ పైడిప‌ల్లి అన్నారు.

``నాకు, నా టీంకు మీ ప్ర‌శంస‌లు గొప్ప గౌర‌వంగా భావిస్తున్నాం. `మ‌హ‌ర్షి`లాంటి సినిమాలు మ‌రిన్ని చేయాల‌ని మీ మాట‌లు మాకు ఉత్తేజాన్ని క‌లిగించాయి. ఇదే గొప్ప ప్ర‌శంస‌. మా టీం త‌ర‌పున థాంక్యూ సార్‌!`` అన్నారు మ‌హేష్‌. 

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.