'అసురన్' కు ముహూర్తం కుదిరింది
Send us your feedback to audioarticles@vaarta.com
విలక్షణ నటుడు ధనుష్ ‘మారి 2’ తర్వాత ‘అసురన్’ అనే సినిమాలో నటించబోతున్నారు. వెట్రి మారన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని చేయబోతున్నట్లు ధనుష్ ఇది వరకే ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని జనవరి 26 నుండి చిత్రీకరించబోతున్నారు. ధనుష్ హీరోగా గతంలో వెట్రిమారన్ దర్శకత్వంలో `పొల్లాదవన్, ఆడుగలం, వడచెన్నై` చిత్రాలు తెరకెక్కి మంచి విజయాన్ని సాధించాయి.
మరోసారి ధనుష్, వెట్రిమారన్ కలిసి సినిమా చేస్తుండటంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ధనుష్ పక్కా మాస్ లుక్లో కనిపించనున్నారు. కలైపులి థాను వి.క్రియేుషన్స్ బ్యానర్పై సినిమాను నిర్మించనున్నారు. ధనుష్, నాగార్జున కాంబినేషన్లో ధనుష్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఫైనాన్సియల్ కారణాలతో ఆగిపోయినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.