ఏపీ బడ్జెట్పై మాజీ మంత్రి యనమల షాకింగ్ కామెంట్స్!
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నేడు తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. శుక్రవారం నాడు ప్రధాన బడ్జెట్ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. వ్యవసాయ బడ్జెట్ను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్లో కేటాయింపులు సరిగ్గా లేవని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఈ బడ్జెట్పై మాజీ ఆర్థిక మంత్రి, శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు స్పందించిస్తూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు, సెటైర్ల వర్షం కురిపించారు. బుగ్గన ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రచారం ఎక్కువ.. పస తక్కువ అని యనమల వ్యంగ్యాస్త్రాలు విసిరారు. సీఎం వైఎస్ జగన్కు దశ ఉంది కానీ దిశ లేదన్నారు. ‘బడ్జెట్లో నేను ఉన్నాను... నేను విన్నాను అని చెప్పే జగన్.. నేను తిన్నాను’ అని కూడా చెప్పుకుంటే బాగుంటుందని సెటైర్లేశారు. దాదాపు 48వేల కోట్లు అప్పు బయట్నుంచి తేవటానికి ప్రభుత్వం సిద్ధమైందని యనమల షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇంత హడావుడి చేసి...!
మేం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మా ప్రభుత్వం అప్పులపై అప్పటి ప్రతిపక్ష పార్టీ నేత ఎన్నో మాట్లాడారన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వడ్డీలేని రుణాలపై ఇంత హడావుడి చేసిన చేసిన జగన్.. కేవలం 100కోట్లు మాత్రమే బడ్జెట్లో పెట్టడం దారుణమన్నారు. సాంఘిక సంక్షేమానికి బడ్జెట్ బాగా తగ్గించారని.. జలవనరుల్లోనూ వెయ్యి కోట్లు తగ్గించారన్నారు. "వ్యవసాయ రంగానికి అంతంత మాత్రమే కేటాయింపులు జరిగాయి. రాష్ట్రంలో వేరే నాయకుడే లేనట్లు అన్ని పథకాలకు వైఎస్సార్, జగన్ పేర్లే పెడుతున్నారు. రాష్ట్రాన్ని ఏం ఉద్ధరించారని వీళ్ళ పేర్లు పెట్టారు. ఫ్యాక్షన్ కుటుంబం పేర్లు ప్రజా పథకాలకు పెట్టడం ఏంటి...?. మా పథకాల పేర్లు మార్చి వాటికి కేటాయింపులు చేశారు. కొన్ని పథకాలను రద్దు చేసి ప్రజలను రోడ్డున పడేస్తున్నారు" అని యనమల రామకృష్ణుడు బడ్జెట్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ ప్రసంగం ముగింపు అనంతరం మీడియాతో మాట్లాడిన యనమల పై వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి వ్యాఖ్యలకు బడ్జెట్ ప్రవేశపెట్టిన బుగ్గన, బొత్సా, వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.