close
Choose your channels

Niharika:ఫస్ట్ టైం మూవీ ప్రొడక్షన్‌లోకి నిహారిక .. వరుణ్ - లావణ్య సమక్షంలో ఓపెనింగ్ , డీటెయిల్స్ ఇవే

Saturday, November 11, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగా వారసురాలు నిహారిక కొణిదెల నిర్మాణ రంగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై పలు వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిలింస్‌ను ఆమె నిర్మించారు. ముద్దపప్పు అవకాయ్, నాన్న కూచి, మ్యాడ్ హౌజ్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, హలో వరల్డ్ , డెడ్ పిక్సల్స్ వంటి వెబ్‌ సిరీ‌స్‌లు సక్సెస్ అయ్యాయి. అయితే తొలిసారిగా చిత్ర నిర్మాణంలోకి దిగారు నిహారిక. అంతేకాదు.. తన ప్రొడక్షన్‌ని పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్‌పీగా మార్చి, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ ప్రొడక్షన్ పతాకంపై సినిమాను స్టార్ట్ చేశారు నిహారిక. ఈ చిత్ర ఓపెనింగ్ సెర్మనీ శుక్రవారం సాయంత్రం అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగింది.

నిహారిక అన్న వదినలు.. కొత్త జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిలు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌లుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి వరుణ్ క్లాప్ కొట్టగా.. నాగబాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్ స్క్రిప్ట్‌ని నిహారిక , డైరెక్టర్ యదు వంశీలకు అందించారు. ఈ సందర్భంగా నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఇప్పటి వరకు వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిలింస్ మాత్రమే చేస్తూ వచ్చామని చెప్పారు. కానీ తొలిసారిగా ఫీచర్ ఫిల్మ్ స్టార్ట్ చేశామని... మాతో పాటు శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారని నిహారిక వెల్లడించారు. ఓ వైపు చాలా హ్యాపీగా .. మరోవైపు తెలియని టెన్షన్‌గానూ ఉందన్నారు. యదు వంశీ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారని... మంచి టీమ్‌, కాన్సెప్ట్‌తో ఈ సినిమా రాబోతోందని నిహారిక పేర్కొన్నారు. ఇంత మంది కొత్త వాళ్లతో సినిమా చేయటం పెద్ద బాధ్యతగా భావిస్తున్నామని.. అయితే మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారనే నమ్మకంతో ముందుకు వెళ్తున్నామని ఆమె చెప్పారు.

దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ .. కొత్తవాళ్లతో ఈ బ్యానర్ సినిమా చేయటం ఆనందంగా ఉందన్నారు. ఇందులో 11 మంది హీరోలు , నలుగురు హీరోయిన్స్‌ని పరిచయం చేస్తున్నట్లు తెలిపారు. నాకు ఇచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటానని, త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందని వంశీ చెప్పారు. శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ అధినేత ఫణి మాట్లాడుతూ .. ఈ సినిమాతో తాను, నా శ్రీమతి జయలక్ష్మీ నిర్మాతలుగా పరిచయం అవుతున్నామన్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రొడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చామని.. ఈ జర్నీలో పింక్ ఎలిఫెంట్ మాకు తోడుగా రావటం చాలా హ్యాపీగా ఉందని ఫణి తెలిపారు. కంటెంట్ ఈజ్ కింగ్.. అందువల్లే డిఫరెంట్ కంటెంట్‌తో ముందుకు రాబోతున్నామని ఆయన చెప్పారు.

నటీనటులు - సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రచిరాజు, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివకుమార్ మట్ట, అక్షయ్ శ్రీనివాస్, శరణ్య సురేష్, తేజస్వి రావు, విషిక, షణ్ముకి నాగుమంత్రి తదితరులు

సాంకతిక వర్గం - సమర్పణ - నిహారిక కొణిదెల, బ్యానర్స్- పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్, నిర్మాతలు - పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక, రచన, దర్శకత్వం - యదు వంశీ, సినిమాటోగ్రఫీ - రాజు ఎడురోలు, మ్యూజిక్ డైరెక్టర్ - అనుదీప్ దేవ్, ప్రొడక్షన్ డిజైనర్ - ప్రణయ్ నైని, ఎడిటర్ - అన్వర్ అలీ, డైలాగ్స్ - వెంకట సుభాస్ చీర్ల, కొండల రావు అడ్డగళ్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - మన్యం రమేష్, పి.ఆర్.ఒ- బియాండ్ మీడియా (నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి).

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.