close
Choose your channels

Hyderabad: హైదరాబాద్‌లో దొంగల బీభత్సం : ప్రముఖ బుల్లితెర నటి ఇంట్లో భారీ చోరీ.. సొత్తు విలువ 70 లక్షల పైమాటే

Friday, April 21, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

హైదరాబాద్‌లో దొంగలు రెచ్చిపోతున్నారు. చైన్ స్నాచింగ్స్‌తో పాటు ఇళ్లలో చొరబడి ఊడ్చేస్తున్నారు. దీంతో జనం వణికిపోతున్నారు. ముఖ్యంగా మహిళలు ఒంటరిగా వీధుల్లోకి రావాలంటేనే జంకుతున్నారు. వేసవి కాలం కావడంతో చాలా మంది వూళ్లలో వుండటం లేదు. ఇలాంటి వారి ఇళ్లను టార్గెట్ చేస్తున్న దొంగలు అందినకాడికి దోచేస్తున్నారు. వీరిలో సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా వుంటున్నారు. తాజాగా ప్రముఖ నటి సుమిత్ర ఇంటిలో భారీ చోరీ జరిగింది. ఏకంగా 1.2 కిలోల బంగారం, 293 గ్రాముల వెండి వస్తువులను దొంగలు దోచుకెళ్లారు. వీటి విలువ రూ.70 లక్షల పైనే వుంటుందని అంచనా.

ఢిల్లీ వెళ్లిన సుమిత్ర.. ఇదే అదనుగా దొంగల చోరీ :

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని క్యాప్రీ టవర్స్ ప్లాట్ నెంబర్ 501లో వుంటున్నారు సుమిత్రా. ఈ క్రమంలో ఏప్రిల్ 17న ఆమె ఢిల్లీ వెళ్లారు. అయితే అక్కడికి దగ్గరలో మరో ప్లాట్‌లో వుంటున్న తన సోదరుడు విజయ్ కుమార్‌కి సుమిత్ర ఇంటి తాళాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 17 అర్ధరాత్రి దాటిన తర్వాత సుమిత్ర ఫ్లాట్ ప్రధాన ద్వారం వద్ద తాళం పగులగొట్టిన దుండగులు.. లోపల దాచిన బంగారం, వెండి, ఇతర విలువైన వస్తులను ఎత్తుకెళ్లారు. అయితే తర్వాతి రోజు దొంగతనం జరగడాన్ని గుర్తించిన ఇరుగుపొరుగు వారు.. సుమిత్ర సోదరుడు విజయ్ కుమార్‌కు తెలియజేశారు. దీంతో ఆయన హుటాహుటిన ఫ్లాట్‌కు వెళ్లి చూడగా అల్మారాలోని వస్తువులు చిందరవందరగా పడేసి వుండటంతో పాటు సొత్తు కనిపించలేదు. ఆ వెంటనే ఈయన విషయాన్ని ఢిల్లీలో వున్న సుమిత్రకు తెలిపారు.

రంగంలోకి పోలీసులు :

బుధవారం హైదరాబాద్‌కు తిరిగొచ్చిన ఆమె పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనతో అపార్ట్‌మెంట్ వాసులు భయాందోళనకు గురవుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.