close
Choose your channels

బాలయ్య సినిమాతోనే దక్కింది

Monday, January 22, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పురియాదా పుదిర్` (1990) చిత్రంతో తమిళ ఇండస్ట్రీలో దర్శకుడిగా అడుగుపెట్టారు కె.ఎస్.రవికుమార్.. ఆ త‌రువాత `ముత్తు`, అవ్వై షణ్ముగి` (భామనే సత్యభామనే`), పడయప్ప` (నరసింహా`), పంచతంతిరం` (పంచతంత్రం`) వంటి సినిమాలతో తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన సినిమాలు తెలుగులో అనువదింపబడి విజయాలు సాధిస్తుండడంతో.. టాలీవుడ్‌లో కూడా తన హవా చాటాలనుకున్న ఈ ద‌ర్శ‌కుడికి.. తెలుగులో నేరుగా చేసిన‌ స్నేహంకోసం` (చిరంజీవి), బావనచ్చాడు` (నాగార్జున), విలన్` (రాజశేఖర్) సినిమాలు ఆశించినంత విజయాన్ని అందించలేకపోయాయి.

దీంతో.. మ‌ళ్ళీ తెలుగు సినిమా వైపు దృష్టి పెట్ట‌లేదాయ‌న‌. సుమారు 15 సంవత్సరాల విరామం అనంతరం.. బాలకృష్ణతో జై సింహా` సినిమాను తెరకెక్కించారు రవికుమార్. ఈ సంక్రాంతి బరిలో విడుదలైన అన్ని సినిమాల్లోనూ హిట్ చిత్రంగా నిలిచి.. దర్శకుడిగా తెలుగులో కూడా విజయం సాధించాలనుకున్న ర‌వికుమార్ కలను నెరవేర్చింది ఈ చిత్రం. అంతేకాకుండా.. తొమ్మిది సంవత్సరాల గ్యాప్ తర్వాత కె.ఎస్‌.ర‌వికుమార్‌కి ద‌క్కిన హిట్ చిత్ర‌మిది. ద‌ర్శ‌కుడిగా ఆయ‌న‌ ఆఖరి హిట్ చిత్రం ఆద‌వన్` (ఘటికుడు). ఆసక్తికరమైన విశేషమేమిటంటే...ఈ రెండు చిత్రాల్లోనూ నయనతార కథానాయిక కావడం.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.