close
Choose your channels

వికటించిన కరోనా వ్యాక్సిన్.. దేశంలో తొలి మరణం!

Tuesday, June 15, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

దేశం నలువైపులా కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా ధాటిని తట్టుకునేందుకు అనేక వ్యాక్సిన్స్ అందుబాటులోకి వచ్చాయి. కరోనాని జయించేందుకు వ్యాక్సినేషన్ చాలా కీలకం అని ప్రపంచ వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఇండియాలో కూడా వ్యాక్సినేషన్ ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందరికి అందుబాటులో ఉంచేలా వ్యాక్సిన్స్ ఉత్పత్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి: కోవిడ్ తగ్గాక కీళ్ల నొప్పులు అందుకే.. టీకా, థర్డ్ వేవ్ గురించి ప్రముఖ ఆర్థోపెడిక్..

అయితే వ్యాక్సిన్స్ పై అనేక అపోహలు ఉన్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని ఇప్పటికే తేలింది. అయితే వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు రోగ నిరోధక శక్తి బలపడడానికి రెండురోజుల పాటు ఇలాంటి దుష్ప్రభావాలు సహజంగానే ఉంటాయి. వాటిని చూసి బయపడనవసరం లేదని వైద్య నిపుణులు భరోసా ఇచ్చారు.

అయితే తాజాగా వ్యాక్సిన్ వల్ల ఇండియాలో తొలి మరణం సంభవించింది. వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువవడం వల్ల 68 ఏళ్ల వృద్దుడు మరణించారు. అడ్వర్స్‌ ఈవెంట్స్‌ ఫాలోయింగ్‌ ఇమ్యునైజేషన్‌(ఏఈఎఫ్‌ఐ) సంస్థ ధృవీకరించింది. ఈ సంస్థ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కలిగే ప్రభావాలపై అధ్యయనం చేస్తూ ఉంటుంది.

ఆ వృద్ధుడు మార్చి 8న తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్నాడు. అనాఫిలాక్సిన్ అని పిలవబడే తీవ్ర అలర్జీ కారణంగా అతడు మరణించినట్లు ఏఈఎఫ్ఐ పేర్కొంది. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత రెండు రోజుల పాటు శరీరానికి తీవ్ర ఒత్తిడి కలిగించే పనులు చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు.

వ్యాక్సిన్ దుష్ప్రభావాలని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తున్నామని ఆ సంస్థ తెలిపింది. అయితే వ్యాక్సిన్ వల్ల అతి తక్కువ శాతంలో ఉండే రిస్క్ తో పోల్చుకుంటే లాభాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని ప్యానల్ తెలిపింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.