close
Choose your channels

Gamma Awards:త్వరలోనే దుబాయ్‌లో గ్రాండ్‌గా 'గామా' అవార్డ్స్ వేడుక..

Friday, February 23, 2024 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

‘గామా’ తెలుగు మూవీ అవార్డ్స్(Gama Awards 4th) ఎడిషన్ దుబాయ్‌లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుకను ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ చేస్తోంది. మార్చి 3న దుబాయ్‌లోని జబిల్ పార్క్‌లో ఈ వేడుకను గామా అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు నిర్వహించబోతున్నారు. దీంతో వేడుకకు సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్యూరీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కోటి, దర్శకుడు విఎన్ ఆదిత్య, సంగీత దర్శకుడు రఘు కుంచె, ప్రముఖ నిర్మాత DVV దానయ్య, యువ దర్శకుడు సాయి రాజేష్, ప్రసన్న, హీరోయిన్ డింపుల్ హయతి, గామా అవార్డ్స్ సీఈఓ సౌరభ్, ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ సుశీల్, ఫణి మాధవ్ పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం ఈ అవార్డుకు సంబంధించిన ట్రోఫీని లాంచ్ చేశారు.

ఈ వేడుకకు సంబంధించిన కర్టెన్ రైజర్ వేడుకలో సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ "గతంలో గ్రాండ్‌గా నిర్వహించిన గామా అవార్డ్స్ మధ్యలో మూడేళ్ల పాటు కోవిడ్ కారణంతో నిర్వహించలేకపోయారు. ఈసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ అవార్డ్స్ వేడుకను నిర్వహించబోతున్నారు. 2021, 2022, 2023లలో విడుదలైన సినిమాల నుంచి.. బెస్ట్ యాక్టర్(మేల్, ఫిమేల్), బెస్ట్ మూవీ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సింగర్ (మేల్, ఫిమేల్), బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, బెస్ట్ లిరిక్స్, బెస్ట్ సెలబ్రిటీ సింగర్ వంటి వివిధ కేటగిరీలకు అవార్డ్స్ ఇవ్వబోతున్నారు"అని తెలిపారు.

దర్శకుడు విఎన్ ఆదిత్య మాట్లాడుతూ షఈ జ్యూరీలో సభ్యుడిగా ఉండడం చాలా ఆనందంగా ఉంది. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయడానికి త్రిమూర్తులు గారు నిర్వహిస్తున్న ఈ వేడుక తెలుగు చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా మారుతుంది" అన్నారు.

నిర్మాత డివివి దానయ్య మాట్లాడుతూ.."గామా అవార్డ్స్ ఫౌండర్ కేసరి త్రిమూర్తులు గారు ఈ అవార్డ్స్ వేడుకను నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది"అన్నారు.

రఘు కుంచే మాట్లాడుతూ.."దేశం కానీ దేశంలో తెలుగువారు గర్వపడేలా ఈ అవార్డ్స్ వేడుకను నిర్వహించడం ఒక తెలుగువాడిగా గర్విస్తున్నాను" అని చెప్పారు.

గామా అవార్డ్స్ సీఈవో సౌరభ్ మాట్లాడుతూ.. తెలుగు, తమిళ, మళయాల సినీ పరిశ్రమల మధ్య దుబాయ్ గామా వేదిక‌పై ఈ వేడుక ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. నేషనల్ అవార్డ్ విన్నర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సహా టాలీవుడ్ ప్రముఖుల అందరిని ఈ వేడుకకు ఆహ్వానించాం అని తెలియచేశారు.

ఇక ఈ వేడుకల్లో ఆస్కార్ పురస్కారం అందుకున్న కీరవాణి, చంద్రబోస్‌ల‌కు ప్రత్యేకంగా ‘గామా గౌరవ్ సత్కార్’తో పాటు, గాయకులు SP బాలసుబ్రహ్మణ్యం స్మృతిగా ‘గామా SPB గోల్డెన్ వాయిస్ అవార్డు’ను గాయకులు మనోకి అందిస్తున్నామని గామా అవార్డ్స్ దర్శకులు ప్రసన్న పాలంకి తెలిపారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్‌కి చెందిన ప్రముఖులు రానున్నారు. ఇందులో హీరోయిన్ డింపుల్ హయతి డ్యాన్స్ షో ప్రత్యేక ఆకర్షణగా ఉండనుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.