రానాకి షాకిచ్చిన హీరోయిన్
Send us your feedback to audioarticles@vaarta.com
రానా దగ్గుబాటి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో రానా హీరోగా రూపొందుతూ ఆగిపోయిన సినిమాలను పూర్తి చేయబోతున్నాడు. అలాగే మరిన్ని కొత్త సినిమాలను రూపొందించడానికి రెడీ అవుతున్నాడు. అందులో నందినీ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడని సమాచారం.
వివరాల ప్రకారం రీసెంట్గా కొరియన్ సినిమా మిస్ గ్రానీని తెలుగులో `ఓబేబీ`గా రీమేక్ చేసి హిట్ సాధించిన డైరెక్టర్ నందినీ రెడ్డి. ఈమె తదుపరి సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లోనే ఓ ద్విభాషా చిత్రం చేయడానికి సిద్ధమవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాలో రానా హీరోగా నటిస్తున్నాడు. కాగా.. ఇందులో రానా సరసన కీర్తి సురేశ్ను నటింప చేయాలని దర్శక నిర్మాతలు భావించి ఆమెను సంప్రదించారట. అయితే కీర్తి సురేశ్ డేట్స్ ఖాళీగా లేవని సింపుల్గా సారీ చెప్పేసిందని సినీ వర్గాల సమాచారం.
`మహానటి`తో కీర్తి సురేశ్ స్టార్హీరోయిన్గా మారింది. ఈ సినిమా తర్వాత కీర్తి సినిమాల ఎంపికలో చాలా జాగ్రత్తలు వహిస్తోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసే ఆప్షన్గా దర్శక నిర్మాతలకు కీర్తి కనపడుతుంది. ప్రస్తుతం ఈమె మిస్ ఇండియా సినిమాలో నటిస్తుంది. అలాగే బాలీవుడ్లోనూ అజయ్ దేవగణ్తో కలిసి `మైదాన్`సినిమాలో నటిస్తుంది. ఇలా చేతినిండా ఆఫర్స్తో ఫుల్ బిజీగా ఉంది కీర్తి సురేశ్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.