close
Choose your channels

కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు డెడ్‌లైన్..

Wednesday, May 5, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణకు హాజరైన డీజీపీ మహేందర్ రెడ్డి, డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ హాజరయ్యారు. విచారణలో భాగంగా హైకోర్టు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో టెస్టుల సంఖ్య తగ్గించి కేసులు తగ్గాయని ఎలా చెబుతారంటూ ఫైర్ అయింది. టెస్టులు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించింది. రాష్ట్రంలో కావాల్సిన టెస్టులు చేస్తున్నామని కోర్టుకు శ్రీనివాసరావు తెలిపారు. అయితే ఒక్కరోజు కూడా లక్ష టెస్టులు దాటలేదెందుకని హైకోర్టు ప్రశ్నించింది. నైట్ కర్ఫ్యూ పెట్టి ప్రభుత్వం చేతులు దులుపుకున్నారంటూ హైకోర్టు మండిపడింది.

Also Read: ఆరోగ్యశాఖ విషయంలో కేసీఆర్ కీలక నిర్ణయం!

అసలు తెలంగాణలో పరిస్థితులు ఇలా ఉంటే.. లాక్‌డౌన్ దిశగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ డేటా సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో ఆక్సిజన్ ఎంత డిమాండ్ ఉందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావును హైకోర్టు ప్రశ్నించింది. 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ డిమాండ్ ఉందని శ్రీనివాసరావు కోర్టుకు తెలిపారు. కేంద్రం 430 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఇచ్చిందని కూడా శ్రీనివాసరావు వెల్లడించారు. ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ తీసుకొచ్చామని శ్రీనివాస్‌రావు కోర్టుకు తెలిపారు. ఇంకా తమిళనాడు నుంచి రావాల్సిన 55 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ రాలేదని శ్రీనివాసరావు వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం కోరిన 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను అందించాలని కేంద్రానికి తెలంగాణ హైకోర్టు అదేశాలు జారీ చేసింది. రెమిడిసివర్ ఇంజక్షన్, టోసిలి జముద్ ఇంజక్షన్‌ల కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ప్రతిరోజు జిల్లాల వారీగా కోవిడ్ టెస్ట్‌ల రిపోర్టులను విడుదల చేయాలని హైకోర్టు తెలిపింది. కరోనాకు సంబంధించి ప్రతి రోజూ మీడియా బులిటెన్ సైతం విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మైక్రో కంటైన్మెంట్ జోన్‌లలో టెస్టుల సంఖ్య పెంచాలని ఆదేశించింది. హితమ్ యాప్‌లో కోవిడ్ వివరాల కోసం ప్రభుత్వం టోల్ ఫ్రీ నంబర్ పెట్టిందని శ్రీనివాసరావు కోర్టుకు వెల్లడించారు. వీకెండ్ లాక్‌డౌన్‌పై ఈ నెల 8 కంటే ముందే నిర్ణయం తీసుకోవాలని టీఎస్ హైకోర్టు ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.