Balineni:మంత్రిగా ఉన్నప్పుడు డబ్బులు తీసుకున్నాను.. బాలినేని సంచలన వ్యాఖ్యలు..


Send us your feedback to audioarticles@vaarta.com


ఏపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నీతిమంతుడినని చెప్పడం లేదని.. తాను మంత్రిగా ఉన్నప్పుడు ఎవరైనా డబ్బులిస్తే తీసుకున్నానంటూ కుండబద్ధలు కొట్టారు. అయితే తాను వెయ్యి కోట్లు సంపాదించానని గిట్టని వాళ్లు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాలపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయాలు చూస్తే తనకు ఇరిటేషన్ వస్తుందని.. అందుకే రాజకీయాలంటే విరకత్తి పుట్టిందని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో బీఆర్ఎస్ గెలవాలని మా అబ్బాయి కోరుకున్నాడని.. తెలంగాణ అంతా తిరిగి బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పాడన్నారు. అయితే తాను మాత్రం కాంగ్రెస్ గెలుస్తుందని రూ.50 లక్షలు బెట్టింగ్ కాశానన్నారు. కానీ తన కుమారుడు ఫీలవుతాడని ఆ బెట్టింగ్ వెనక్కి తీసుకున్నానని వెల్లడించారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలిస్తే ఏపీలోనూ జగన్ గెలుస్తారని తన కుమారుడు అనుకున్నాడని చెప్పుకొచ్చారు. జగన్ అంటే తన కుమారుడికి అభిమానమని.. అయితే జగన్కూ తమపై అభిమానం ఉండాలి కదా అంటూ మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే జగన్ తమను నిరాదరిస్తున్నట్లు ఉందని పరోక్షంగా చెప్పినట్లు ఉంది.
అలాగే తనకు ఒంగోలులో కాకుండా వేరే నియోజకవర్గం టికెట్ ఇస్తారనే ప్రచారంపై ఆయన స్పందిస్తూ ఒంగోలులోనే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఒంగోలు కాకుండా మరో చోట పోటీ చేయనని క్లారిటీ ఇచ్చారు. నియోజకవర్గంలో పాతిక వేల ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇస్తేనే పోటీ చేస్తానని సీఎం జగన్కి చెప్పానని బాలినేని పేర్కొన్నారు. ప్రస్తుతం కుల ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ గెలుపు కోసం ఓ కులం ప్రజలంతా రోడ్ల మీదకు వచ్చి కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారని.. మీరంతా అండగా ఉంటేనే పోటీ చేస్తా లేదంటే చేయనని ప్రజలను ఉద్దేశించి చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com