close
Choose your channels

ప్రయాణికులకు చుక్కలు చూపిన ఇండిగో విమానం!

Sunday, April 21, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రయాణికులకు చుక్కలు చూపిన ఇండిగో విమానం!

ఇండిగో విమానం ప్రయాణికులకు చుక్కలు చూపించింది. హైదరాబాద్ నుంచి శనివారం సాయంత్రం వైజాగ్‌కు బయల్దేరిన విమానం ల్యాండింగ్ కాలేదు. గత రెండ్రోజులు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో వాతావరణం అనుకూలించక విమాన ప్రయాణికులు ఒకచోట నుంచి మరో చోటికి వెళ్లాలంటే తీవ్ర ఇక్కట్లు తప్పట్లేదు. వివరాల్లోకెళితే.. శనివారం సాయంత్రం ఆరు గంటలకు ప్రయాణికులతో ఇండిగో విమానం వైజాగ్‌కు బయల్దేరింది. అయితే ఉరుములు, మెరుపుల మధ్యనే వైజాగ్‌కు విమానం వెళ్లినప్పటికీ అక్కడ ల్యాండింగ్‌ చేయడానికి వీలు కాలేదు. ఒకటికి రెండు సార్లు ల్యాండింగ్ చేయడానికి ఫైలెట్ ప్రయత్నించినప్పటికీ వీలుకాలేదు. ఈ కుదుపులతో ప్రయాణికులు అరుపులు కేకలతో హోరెత్తించారు. దీంతో మళ్లీ వైజాగ్ నుంచి హైదరాబాద్‌‌కు విమానం తిరుగుపయనమైంది.

ఇదిలా ఉంటే.. అనుకున్న సమయానికి ఇంటికి రాకపోవడంతో ప్రయాణికుల కుటుంబ సభ్యులు అసలేం జరిగిందా..? ఆందోళన చెందుతున్నారు. మరోవైపు భారీ వర్షంతో ఫోన్లు కూడా కలవకపోవడంతో మరికొందరు ప్రయాణికులు ఇంటికి సమాచారం కూడా చేరవేయలేకపోయారు. విమానంలోని ప్రయాణికులంతా గగ్గోలు పెడుతుండటంతో వారికి నచ్చజెప్పి.. అందరికీ స్నాక్స్ ఇచ్చింది సిబ్బంది. దీంతో ప్రయాణికులు కాసేపు సేదతీరారు. అయితే వాతావరణం అనుకూలిస్తే అరగంటలో హైదరాబాద్‌ నుంచి వైజాగ్‌కు వెళ్తామని సిబ్బంది ప్రయాణికులకు చెప్పింది. సింగిల్ టికెట్‌తో హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు.. మళ్లీ వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చామని కొందరు హాయిగా ఎంజాయ్ చేయగా.. మరికొందరు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే ఇంకా విమానం హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు కదిలిందా..? లేదా..? అనే విషయం ఇంకా తెలియరాలేదు. కాగా ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.