close
Choose your channels

'మ‌హా స‌ముద్రం'ను ప‌క్క‌న పెట్టేశాడా?

Sunday, November 3, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మ‌హా స‌ముద్రంను ప‌క్క‌న పెట్టేశాడా?

డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి.. తొలి చిత్రం `RX100`తో సెన్సేష‌న‌ల్ హిట్‌ను సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు. ఈ యువ ద‌ర్శ‌కుడు రెండో సినిమాను స్టార్ట్ చేయ‌డానికి మాత్రం ఎక్కువ స‌మ‌య‌మే తీసుకుంటున్నాడు. రవితేజ‌తో, మ‌రో హీరోతో `మ‌హాసముద్రం` సినిమాను చేయాల‌నుకున్నాడు. కానీ రెమ్యున‌రేష‌న్ గొడ‌వ కార‌ణంగా ఆ ర‌వితేజ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకోవ‌డంతో త‌న‌ని చీప్‌స్టార్ అని కామెంట్ చేసి వార్త‌ల్లో కూడా నిలిచాడు.

త‌ర్వాత కార్తికేయ‌, విశ్వ‌క్‌సేన్‌ల‌తో ఈ సినిమాను అజ‌య్ భూప‌తి తెర‌కెక్కిస్తాడ‌ని వార్త‌లు వినిపించాయి. అంతా ఓకే అనుకున్న త‌రుణంలో ఇప్పుడు మ‌రో ట్విస్ట్ వ‌చ్చింది. అజ‌య్ భూప‌తి మ‌హాసముద్రం సినిమాను ప‌క్క‌న పెట్టేసిన‌ట్లే క‌న‌ప‌డుతుంది. ఎందుకంటే అక్కినేని నాగ‌చైత‌న్య అజ‌య్ భూప‌తితో సినిమా చేయ‌డానికి ఓకే చెప్పాడ‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

నిజానికి అజ‌య్‌భూప‌తి, నాగ‌చైత‌న్య కాంబినేష‌న్‌లో సినిమా ఉంటుంద‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వచ్చాయి. అయితే అలాంటివేం లేవ‌ని కూడా వార్త‌లు వినిపించాయి. ఈ త‌రుణంలో రీసెంట్‌గా అజ‌య్‌భూప‌తి ఓ పాయింట్‌ను నాగ‌చైత‌న్య‌కు వినిపించాడ‌ట‌. చైతుకి లైన్ న‌చ్చ‌డంతో త‌ను ఓకే చెప్పాడ‌ట‌. ఇప్పుడు అజ‌య్ భూప‌తి ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే ప‌నిలో ఉన్నాడ‌ట‌. ప్ర‌స్తుతం చైతు, శేఖ‌ర్ క‌మ్ముల, సాయిప‌ల్ల‌వి కాంబినేష‌న్‌లో `ల‌వ్‌స్టోరీ` అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తి కాగానే.. అన్ని అనుకున్న‌ట్లు ఉంటే చైతు, అజ‌య్ సినిమాను అనౌన్స్ చేస్తార‌ని టాక్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.