నవ్యాంధ్ర రాజధానిని వైఎస్ జగన్ మార్చేస్తున్నారా..!?
Send us your feedback to audioarticles@vaarta.com
నవ్యాంధ్ర రాజధాని అమరావతిని యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మార్చేస్తున్నారా..? సీఎం కుర్చీలో కూర్చున్న నాటి నుంచి ఇప్పటి వరకూ అందుకే రాజధాని గురించి ఇంత వరకూ మాట్లాడలేదా..? కనీసం మంత్రులు కూడా స్పందించకపోవడంతో దీన్ని ఏమని అర్థం చేసుకోవాలన్నది ఇప్పుడు రాజధాని రైతుల్లో మెదులుతున్న ఏకైక ప్రశ్న.
సంచలనాలకు కేరాఫ్గా జగన్!
సంచలన నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన యువ ముఖ్యమంత్రి ఎప్పుడే నిర్ణయం తీసుకుంటారో ప్రజలకు అర్థం కావట్లేదు. అయితే ఆ నిర్ణయాలు ఏదో ఒక వర్గానికి రైతులు, ఉద్యోగుల విషయంలోనే కావడం విశేషమని చెప్పుకోవచ్చు. గతంలో పాలించిన.. ముఖ్యంగా వైఎస్సార్ కూడా ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం తాము చూడ్లేదని అధికారులు, ఓట్లేసిన ప్రజలు సైతం ఆశ్చర్యపోతున్నారు. అయితే తాజాగా జనాల్లో నవ్యాంధ్ర రాజధాని పరిస్థితేంటి..? ఇంతకీ రాజధాని ఇక్కడ ఉంటుందా..? లేదా అన్నది ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న.
ఈ రెండే కారణాలా!
వాస్తవానికి రాష్ట్ర విభజన సమయంలో దోనకొండను రాజధానిగా ఎంపిక చేస్తే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన స్వార్ధం కోసం అమరావతిని రాజధాని చేసారని.. ప్రభుత్వంపై జగన్ పెద్ద యుద్ధమే చేశారు.. ఇదంతా టీడీపీ నేతల కోసమే చేస్తున్నారని అప్పట్లో ఆరోపించారు. అంతేకాకుండా వందల ఎకరాలకు రాజధాని కావాల్సి ఉంటే.. వేల ఎకరాలు ఎందుకు తీసుకున్నారో గత ప్రభుత్వానికి కూడా అర్థం కానిపరిస్థితి. దీంతో రాజధాని పరిసర ప్రాంతాల్లో రైతులు చాలా వరకు తీవ్ర అసంతృప్తితో భూములిచ్చారన్నది జగమెరిగిన సత్యం.
దొనకొండే రాజధాని!
అయితే ప్రభుత్వం, ప్రజలు లాభం పొందేందుకు రాజధానిని ‘దొనకొండ’కు మార్చాలని వైఎస్ జగన్ ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ముందుచూపు ఉన్న వైసీపీ నేతలు దోనకొండలో భూములు కోంటున్నారాని వస్తున్న వార్తలు రాజధాని మార్పుపై వస్తున్న గుసగుసలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఒకవేళ రాజధాని మారుస్తే ప్రజలకు లాభం ఏంటి ? ప్రతిపక్ష నేతలకు నష్టాలు ఏంటి ? అనేది మాత్రం తెలియరాలేదు. అయితే ఈ నిర్ణయం వల్ల ప్రజలు, ప్రభుత్వం లాభపడుతాయట. ఈ వార్తలు మాత్రం అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. మరోవైపు టీడీపీ కార్యకర్తలు సైతం జగన్ ఇలా చేస్తున్నారు..? అలా చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున హంగామా చేస్తున్నారు. అయితే ఇది ఎంత వరకు నిజమో..? అబద్ధమో తెలియాలంటే జగన్ కానీ.. మంత్రులు కానీ రియాక్ట్ అయితే క్లారిటీ వచ్చే వస్తుందేమో.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.