close
Choose your channels

మరో బయోపిక్‌లో కీర్తి సురేశ్..?

Saturday, April 25, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మరో బయోపిక్‌లో కీర్తి సురేశ్..?

మ‌ల‌యాళ చిత్రాల్లో నటించి ఆ త‌ర్వాత తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ కీర్తిసురేశ్ త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కుల‌కు నేను శైల‌జ చిత్రంతో ప‌రిచ‌యమైంది. త‌ర్వాత తెలుగు, త‌మిళ చిత్రాల‌కే ఎక్కువ ప్రాధాన్య‌త‌నిస్తూ సినిమాలు చేస్తూ వ‌స్తుంది. అల‌నాటి అగ్ర క‌థానాయిక సావిత్రి బ‌యోపిక్ మ‌హాన‌టిలో నటించి ఏకంగా జాతీయ ఉత్త‌మ‌న‌టి అవార్డును సొంతం చేసుకుంది. సినిమాల ఎంపికలోనూ ఆచితూచి వ్యవహరిస్తోంది. తాజాగా సినీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు కీర్తి మరో బయోపిక్‌లో నటిస్తుందని వార్తలు వినపడుతున్నాయి. ఆ బయోపిక్ ఎవరిదో కాదు... మహిళా దర్శకురాలు విజయ నిర్మల. నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన విజయ నిర్మల తర్వాత సూపర్‌స్టార్ కృష్ణను పెళ్లి చేసుకున్నారు. తర్వాత నిర్మాతగా, దర్శకురాలిగా మారి ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు.

50 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించిన మహిళగా ఈమె గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌ను క్రియేట్ చేశారు. ఈ స్థాయిని అందుకనే లోపు ఆమె జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. అయినా కూడా ఆమె ధైర్యంతో వాటిని అధిగమించి ముందుకుసాగారు. ఈమె జీవితాన్ని సినిమా రూపంలో తెరకెక్కించాలని ఆమె తనయుడు, సీనియర్ నటుడు వి.కె.నరేశ్ భావిస్తున్నాడట. కీర్తిసురేశ్ అయితే పాత్రకు సూట్ అవుతుందని, సినిమాకు కూడా మంచి హైప్ వస్తుందని నరేశ్ భావిస్తున్నాడట. మరి కీర్తి సురేశ్ కథతో పాటు మంచి దర్శకుడు సినిమాను హ్యాండిల్ చేయడం, స్క్రిప్ట్ నచ్చితనే సినిమా చేయడానికి ఓకే అంటుందనడంలో సందేహం లేదు. మరి నరేశ్ ఏ డైరెక్టర్‌ను తీసుకొస్తాడో చూడాలి. మరో పక్క కీర్తి సురేశ్ప్ర‌స్తుతం నితిన్‌తో రంగ్ దే, సూప‌ర్‌స్టార్ రజినీకాంత్‌తో అణ్ణాత్త చిత్రాల్లోనూ న‌టిస్తుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.