close
Choose your channels

జగన్ మాట తప్పరు.. మడమ తిప్పరు: కిల్లి

Tuesday, February 19, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

వైసీపీలోకి రోజురోజుకు వలసలు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికే పలువురు సిట్టింగ్‌‌లు వైసీపీ తీర్థం పుచ్చుకోగా.. మరోవైపు ఒకప్పుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్‌లో ఓ వెలుగువెలిగిన, మంత్రులుగా పనిచేసిన కీలకనేతలంతా జగన్ సమక్షంలో పార్టీలో చేరతున్నారు. కాగా త్వరలోనే మరికొంతమంది సిట్టింగ్‌‌లు, కీలకనేతలు వైసీపీలో చేరతారని సమాచారం. ఇదిలా ఉంటే రెండ్రోజుల్లో ఎవరొచ్చినా వైసీపీలో చేర్చుకుంటామని ఆ తర్వాత కష్టమని వైఎస్ జగన్ పరోక్షంగా నేతలతో సంకేతాలు పంపినట్లుగా తెలుస్తోంది.

తాజాగా కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ కీలకనేత కిల్లి కృపారాణి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి వైఎస్ జగన్‌‌ను కలిశారు. లోటస్‌పాండ్‌‌లో సుమారు అరగంటపాటు జరిగిన ఈ భేటీలో సీటు విషయం, తాజా రాజకీయ పరిణామాలపై నిశితంగా చర్చించినట్లు తెలిసింది. కాగా ఈ నెల 28న అమరావతిలో వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే కిల్లికి శ్రీకాకుళం టికెట్ ఇస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

వైఎస్ జగన్ మాట తప్పరు.. బేషరతుగా వైసీపీలోకి..

" వైఎస్‌ జగన్‌ మాట తప్పరని, మడమ తిప్పని నేత అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగడం ఇష్టం లేక ఆ పార్టీకి రాజీనామా చేశాను. జగన్‌ మోహన్‌ రెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని.. మళ్లీ రాజన్న రాజ్యం జగన్‌తోనే వస్తుంది. అందుకే పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నాను. ఈ నెల 28న అమరావతిలో జగన్‌ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతాను. టికెట్‌‌ ఆశించి వైసీపీలోకి రాలేదు.. బేషరుతగా వైసీపీలో చేరుతున్నాను. బీసీ గర్జనలో జగన్‌ ఇచ్చిన హామీలు నచ్చాయి. కాంగ్రెస్, టీడీపీ పొత్తను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఈ విషయమై నేను కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాశాను. ప్రత్యేక హోదాపై చంద్రబాబు మాట మార్చారు. బీసీలను, కులవృత్తుల వారిని వాడుకొని చంద్రబాబు వదిలేశారు. ఏపీ ప్రజలు చంద్రబాబు మాటలు విశ్వసించరు" అని కృపారాణి చెప్పుకొచ్చారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.