close
Choose your channels

10 మందితో కేసీఆర్ ఫస్ట్ టీమ్

Tuesday, February 19, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

గులాబీ బాస్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టీమ్ రెడీ అయ్యింది. 10మందితో గులాబీ బాస్ టీమ్ రెడీ అయ్యింది. ప్రభుత్వం ఏర్పడి సుమారు 66రోజుల తర్వాత తొలి మంత్రి వర్గ విస్తరణ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సమక్షంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. రాజ్‌భవన్‌‌లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, మంత్రులుగా ప్రమాణం చేసిన కుటుంబీకులు, ఆత్మీయులు అందరూ విచ్చేశారు.

మంత్రులుగా ప్రమాణం చేసింది వీరే...

అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి

తలసాని శ్రీనివాస్ యాదవ్

గుంటకండ్ల జగదీశ్ రెడ్డి

ఈటల రాజేందర్

సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

కొప్పుల ఈశ్వర్

ఎర్రబెల్లి దయాకర్ రావు

వి శ్రీనివాస్ గౌడ్

వేముల ప్రశాంత్ రెడ్డి

చామకూర మల్లారెడ్డి

మొదటి కేబినెట్ విస్తరణలో నలుగురు సీనియర్లు, ఆరుగురు కొత్తవారికి చోటు దక్కింది. జిల్లాలు, సామాజిక వర్గాలను బేరీజు చేసుకుని మంత్రి వర్గ విస్తరణ జరిగింది. పైన చెప్పిన వారంతా మంత్రులుగా ప్రమాణం చేసి సంతకాలు చేశారు.

కాగా.. ఈ కార్యక్రమానికి హరీశ్, కేటీఆర్‌ కూడా హాజరయ్యారు. కాగా ఇప్పటి వరకూ భారీ నీటి పారుదల శాఖ ఎవరికీ కేటాయించకపోవడంతో హరీశ్‌‌కే మళ్లీ ఇస్తారని తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల అనంతరం రెండోసారి మంత్రి వర్గ విస్తరణ ఉంటుంది. ఈ విస్తరణలో హరీశ్, కేటీఆర్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.