close
Choose your channels

ఒంటేరుకు టీఆర్ఎస్ కండువా కప్పిన కేటీఆర్

Friday, January 18, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కాంగ్రెస్ నేత, తెలంగాణ సీఎం కేసీఆర్‌ బద్ధశత్రువు, గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి రెండు సార్లు పోటీచేసి ఓడిపోయిన ఒంటేరు ప్రతాప్ రెడ్డి‌‌ ఎట్టకేలకు కారెక్కేశారు. గురువారం అనుకున్నట్లుగానే ఇవాళ సాయంత్రం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఒంటేరు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఒంటేరు.. కేసీఆర్‌ను ఆకాశానికెత్తేశారు. తెలంగాణ ప్రజలంతా కేసీఆర్‌వైపే ఉన్నారని చెప్పుకొచ్చారు. రైతాంగమంతా కేసీఆర్‌కే ఓటేసి జై కొట్టిందని ఒంటేరు చెప్పడం గమనార్హం.

కేటీఆర్ మూడు సార్లు అడిగారు..!

"టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీలో చేరాలని తనను మూడుసార్లు సంప్రదించారు. గతంలోనే టీఆర్‌ఎస్‌లో చేరి ఉంటే ఎంతో బాగుండేది. ఎన్నికల్లో కేసీఆర్‌కు రైతులు అండగా నిలిచారు. ఎన్నికల్లో గెలవాలనే పోరాటం చేశాను.. అంతే తప్ప కేసీఆర్‌పై వ్యక్తిగత ద్వేషం లేదు. గజ్వేల్‌ అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లో చేరాను. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందుతున్నాయి. పార్టీలో ఏ బాధ్యత అప్పజెప్పినా సమర్థవంతంగా నిర్వహిస్తాను" అని ఒంటేరు చెప్పుకొచ్చారు.

తప్పు చేశాను..!

"మల్లన్నసాగర్‌, వేములఘాట్‌ రైతులు కూడా కేసీఆర్‌కు ఓటేశారు. మా పోరాటంలో తప్పు ఉందని భావిస్తున్నాను. కాంగ్రెస్‌ నేతలు నాతో మాట్లాడారు.. పార్టీ మారొద్దని నచ్చజెప్పారు. నియోజకవర్గ ప్రజల కోసమే పార్టీ మారుతున్నట్లు వారికి క్లారిటీగా చెప్పాను. ఎలాంటి హామీలతో నేను టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడం లేదు.. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే పార్టీ మారుతున్నాను" అని ఒంటేరు తెలిపారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.