రజనీకాంత్తో ఆ వారిద్దరూ మరోసారి!!
Send us your feedback to audioarticles@vaarta.com
రజినీకాంత్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం `దర్బార్`. వచ్చే సంక్రాంతి సందర్భంగా జనవరి 9న సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన రజనీకాంత్ డబ్బింగ్ కూడా పూర్తి చేశారు. ఇప్పుడు రజినీకాంత్ 168వ చిత్రానికి సన్నద్ధమవుతున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్పై శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ఖుష్బూ రజినీకాంత్తో నటిస్తుందని, రజినీ కుమార్తె పాత్రలో కీర్తిసురేష్ నటిస్తుందని టాక్. అయితే తాజా సమాచారం మేరకు ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో మీనా నటించనుందని కోలీవుడ్ వర్గాల సమాచారం. రజినీకాంత్ సరసన ఖుష్బూ, మీనా ఇద్దరు నటించి హిట్ హీరోయిన్స్గా పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఓకే చిత్రంలో ఇద్దరూ రజినీకాంత్ నటిస్తున్నారు.
హీరోలను మాస్గా చూపించడంలో శివ స్పెషలిస్ట్. అందుకనే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ శివతో వరుసగా వీరం, వేదాళం, వివేకం, విశ్వాసమ్ సినిమాలను చేశాడు. ఇప్పుడు రజనీకాంత్తో శివ సినిమా అనగా మాస్ ఇమేజ్ ఉన్న రజనీకాంత్ను శివ ఎలా చూపిస్తాడో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరగుతున్నాయి. ఈ చిత్రానికి `వ్యూహం` అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.