close
Choose your channels

మెగాస్టార్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్‌డేట్ వచ్చేసింది..

Wednesday, November 4, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగాస్టార్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్‌డేట్ వచ్చేసింది..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఆచార్య. అటు మెగాస్టార్ ‘సైరా నరసింహారెడ్డి’ తరువాత నటిస్తున్న సినిమా కాగా.. ఇటు దర్శకుడు కొరటాల శివ రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. కాగా ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డే్ట్‌ను చిత్రబృందం వెల్లడించింది. మెగాస్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘ఆచార్య’ షూటింగ్ నవంబర్ 9 నుంచి జరగనుంది.

అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. నవంబర్ 9 నుంచి మేజర్ షెడ్యూల్ జరగనుంది. ఈ భారీ షెడ్యూల్‌లో చిత్రానికి సంబంధించిన మేజర్ పార్ట్‌ను షూట్ చేయనున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. ఈ చిత్రంలో చిరు దేవాదాయ శాఖలో జరిగే అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడే లీడర్ పాత్రలో చిరు నటిస్తున్నాడు. రామ్ చరణ్ కూడా ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

మెగాస్టార్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్‌డేట్ వచ్చేసింది..

ధర్మస్థలి అనే ప్రాంతంలో జరిగే కథగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇందులో కూడా ఓ ఊరి కోసం.. గుడి కోసం పోరాడే నాయకుడిగా చిరు నటిస్తున్నారు. కమర్షియల్ అంశాలకు ఏమాత్రం ఢోకా లేకుండా ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ‘ఆచార్య’కు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మణిశర్మ చాలా కాలం తర్వాత సంగీతం అందిస్తున్న భారీ సినిమా ఇదే కావడం విశేషం. ఈ చిత్రం 2021 సమ్మర్‌లో విడుదల కానుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos