close
Choose your channels

కోవిడ్ నుంచి కోలుకున్న లతా మంగేష్కర్.. వెంటిలేటర్ తొలగింపు

Sunday, January 30, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కోవిడ్ నుంచి కోలుకున్న లతా మంగేష్కర్.. వెంటిలేటర్ తొలగింపు

దిగ్గజ నేపథ్య గాయనీ, భారతరత్న లతా మంగేష్కర్ (92) ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెను జనవరి 8న ముంబైలోని బీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. అప్పటినుంచి ఐసీయూ (ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. అభిమానులు, సినీ ప్రముఖులు, దేశ ప్రజల కోసం ఎప్పటికప్పుడు లతాజీ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను హాస్పిటల్ యాజమాన్యం వెల్లడిస్తూనే ఉంది.

తాజాగా ఆమె ఆరోగ్యం మెరుగుపడిందని మహారాష్ట్ర మంత్రి రాజేష్ తోప్ ఆదివారం వెల్లడించారు. కోవిడ్,న్యుమోనియా నుంచి లతాజీ కోలుకున్నట్లు చెప్పారు. ఆమెకు చికిత్స అందిస్తున్న డాక్టర్ ప్రతిత్ సందానితో తాను మాట్లాడానని.. లతా మంగేష్కర్ కోలుకుంటున్నట్లు రాజేశ్ తెలిపారు. కొన్నిరోజుల పాటు ఆమెని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ప్రస్తుతం వెంటిలేటర్ తొలగించి లతాజీని వేరే గదికి మార్చి సిలిండర్ల ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నట్లు రాజేశ్ తోప్ వెల్లడించారు. ఆమె ప్రస్తుతం చికిత్సకు స్పందిస్తున్నారని మంత్రి తెలిపారు.

కోవిడ్ నుంచి కోలుకున్న లతా మంగేష్కర్.. వెంటిలేటర్ తొలగింపు

ఇక లతామంగేష్కర్ విషయానికి వస్తే.. పదమూడేళ్లకే ప్లే బ్యాక్ సింగర్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. సుదీర్ఘ కెరీర్‌లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ తదితర భాషల్లో వేలాది పాటలు పాడి శ్రోతలను అలరించారు. ఈ క్రమంలో లతాజీ ఎన్నో అవార్డులను అందుకున్నారు. 1948 నుంచి 1978 మధ్యకాలంలో 50 వేల పాటలు పాడిన ఏకైక గాయనిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ స్థానం సంపాదించారు. గానకోకిల అనే బిరుదును అందుకున్నారు. సినీ సంగీత ప్రపంచానికి చేసిన సేవలకు గాను 1969లో పద్మభూషణ్, 1999లో పద్మవిభూషణ్, 2001లో భారతరత్న, వంటి పురాస్కారాలతో భారత ప్రభుత్వం లతా మంగేష్కర్ ను సత్కరించింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.