చెన్నై నీటి సమస్యపై హాలీవుడ్ హీరో స్పందన...
Send us your feedback to audioarticles@vaarta.com
చెన్నై మహానగరంలో ప్రతిరోజూ నీటి సమస్య పెరుగుతూనే ఉంది. నీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద పెద్ద హోటల్స్ను క్లోజ్ చేస్తుంటే.. కంపెనీలు సైతం తాత్కాలిక సెలవులను ప్రకటిస్తున్నాయి. వాటర్ ట్యాంకుల ద్వారా ప్రభుత్వం అందించే నీటి కోసం ప్రజలు గంటలు గంటలు వేచి చూడాల్సి వస్తుంది. సోమవారం చెన్నై నీటి సమస్యపై టాలీవుడ్ హీరో మంచు మనోజ్ స్పందించారు. ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ హీరో లియోనార్డో కూడా స్పందించారు. ఆయన ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందనను తెలియజేశారు.
``చెన్నైలో నీటికి సంబంధించిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ప్రజలు పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రజలు ప్రభుత్వం అందించే నీటి కోసం గంటలు గంటలు వేచి చూడాల్సి వస్తుంది. నీరు లేకుండా హోటల్స్, రెస్టారెంట్స్ మూసి వేస్తున్నారు. మెట్రోల్లో ఏసీ వాడకాన్ని ఆపేశారు`` అన్నారు లియోనార్డో.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.