డబ్బు, కులం కావాలని నిరూపించారుగా! : మాధవీలత
Send us your feedback to audioarticles@vaarta.com
2019 ఎన్నికల ఫలితాల గురించి అందరూ పలు రకాలుగా కామెంట్స చేసుకుంటున్నారు. విశ్లేషణలు, ఓదార్పులు జరుగుతున్నాయి. విజయవాడ సెంట్రల్ నియోజక వర్గం నుండి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన మాధవీలత తన ఓటమి గురించి స్పందించారు. ``నేను ఓడిపోతానని నాకూ తెలుసు, మీకు తెలుసు. అందుకనే నేను గెలుస్తానని ఎక్కడా చెప్పలేదు. బాధ్యతగా పనిచేస్తున్నాననే చెప్పాను. మోడీగారు మళ్లీ రావాలని కోరుకున్నాను.. వచ్చారు. కానీ పవన్కల్యాణ్గారి ఓటమే విడ్డూరంగా ఉంది.
డబ్బులు ఇస్తేనే ఓటు వేస్తాం. నిజాయతీపరులు వద్దు అని భలే చెప్పారుగా. అభిమానులు ఏమయ్యారు.. ఎన్ని మాటలు చెప్పారు? చదువుకున్నవాళ్లే రాజకీయాల్లోకి రావాలంటారు. మరి జెడి లక్ష్మీనారాయణగారు వచ్చారు. ఎందుకు ఓడించారు?. మీ ఓట్లు ఏమయ్యాయి. డబ్బు, కులం ప్రధానమని మరోసారి నిరూపించారు. చదువు, నీతి వద్దు` అని నిరూపించారు అంటూ జనాలపై మాధవీలత పంచ్లేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.