'మళ్లీ మళ్లీ చూశా' టీజర్ విడుదల
Send us your feedback to audioarticles@vaarta.com
అనురాగ్ కొణిదెన హీరోగా పరిచయమవుతొన్న చిత్రం "మళ్లీ మళ్లీ చూశా". క్రిషి క్రియేషన్స్ పతాకంపై సాయిదేవ రామన్ దర్శకత్వంలో కొణిదెన కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్వేత అవస్తి, కైరవి తక్కర్ హీరొయిన్ లుగా నటిస్తున్నారు. ఈ చిత్ర టీజర్ ను నిర్మాత సురేష్ బాబు విడుదల చేశారు.
సురేష్ బాబు మాట్లాడుతూ.. "మళ్లీ మళ్లీ చూశా" టీజర్ చాలా ఫ్రెష్ గా ఉంది. కంటెంట్ యూత్ కు బాగా చెరువయ్యేలా ఉంది. హీరో అనురాగ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. టీమ్ కు ఆల్ ది బెస్ట్ అన్నారు.
దర్శకుడు సాయిదేవ రామన్ .. సురేష్ బాబు గారికి ధన్యవాదాలు. ప్రకృతి సృష్టించిన అందమైన ప్రేమకథ చిత్రం మా "మళ్ళీ మళ్ళీ చూశా" సినిమా" అన్నారు.
నిర్మాత కోటేశ్వరరావు కొణిదెన మాట్లాడుతూ.. మా సినిమా కంటెంట్ నచ్చి టీజర్ విడుదల చెసిన సురేష్ బాబు గారికి ధన్యవాదాలు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. సినిమా మేం అనుకున్న దానికంటే బాగా వచ్చింది. త్వరలోనే ఆడియో రిలీజ్ ని చేసి విడుదల తేదీని ప్రకటిస్తాం." అన్నారు.
హీరో అనురాగ్ మాట్లాడుతూ.. "కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాతో హీరోగా పరిచయమవు తున్నందుకు ఆనందంగా వుందన్నారు. మళ్లీ మళ్లీ చూడాలనిపించే ప్రేమకథ'' ఇదన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.