close
Choose your channels

మే 20న మంచు లక్ష్మి ప్రసన్న కొత్త చిత్రం ప్రారంభం

Wednesday, May 11, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మంచు వారసురాలిగా, నటిగా, నిర్మాతగా, సింగర్ గా, యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుని నటన పరంగా విలక్షణ పాత్రలతో మెప్పిస్తున్న మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో ఓ కొత్త చిత్రం ప్రారంభం కానుంది. గుణపాటి సురేష్ రెడ్డి సమర్పణలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందనుంది. కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమ లక్ష్మి నరసింహ నిర్మాతలుగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సందర్భంగా...

చిత్ర నిర్మాతలు వేళ్ల మౌనిక చంద్రశేఖర్, ఉమ లక్ష్మి నరసింహ మాట్లాడుతూ `మంచు లక్ష్మిగారు కథ వినగానే చేయడానికి ఒప్పుకున్నందుకు ఆమెకు మా సంస్థ తరపున ధన్యవాదాలు. జగపతిబాబుగారితో సాధ్యం, నవదీదప్ తో వసూల్ రాజా వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ చెప్పిన కథ చాలా కొత్తగా ఉంది. ఈ సినిమా మే 20న లాంచనంగా పూజా కార్యక్రమాలను జరుపుకుంటుంది. థ్రిల్లర్ కామెడి సబ్జెక్ట్ తో రూపొందనున్న ఈ చిత్రం జూన్ నుండి రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకోనుంది. హైదరాబాద్ లో జరిగే సింగిలో షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేస్తాం. మంచి టీంతో సినిమాను నిర్మిస్తాం. సినిమా ప్రారంభోత్సవం రోజున మిగతా నటీనటులు, టెక్నిషియన్స్ వివరాలను తెలియజేస్తాం`` అన్నారు.

దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ మాట్లాడుతూ `మంచు లక్ష్మిగారు ఇప్పటి వరకు చేయని డిఫరెంట్ పాత్రలో కనపడనున్నారు. న్యాయం కోసం పోరాడే జడ్జ్ పాత్రలో మంచు లక్ష్మి ప్రసన్నగారి పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు థాంక్స్``అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.