close
Choose your channels

త్రివిక్రమ్- మహేశ్ మూవీలో హీరోయిన్‌గా మిస్ ఇండియా...!!

Friday, October 22, 2021 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

త్రివిక్రమ్- మహేశ్ మూవీలో హీరోయిన్‌గా మిస్ ఇండియా...!!

చాలా ఏళ్ల తర్వాత సూపర్‌స్టార్ మహేశ్- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. సర్కార్ వారి పాట షూటింగ్‌లో బిజీగా ప్రిన్స్.. దీనిని త్వరగా కంప్లీట్ చేసి త్రివిక్రమ్ మూవీని పట్టాలెక్కించాలని మహేశ్ భావిస్తున్నారని ఫిలింనగర్ టాక్. అయితే సినిమాను షూట్ చేసే ముందే నటీనటులు, టెక్నీషియన్లను ఎంపిక చేసే పనిలో త్రివిక్రమ్ వున్నారట.

ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన మరో ఆసక్తికర అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో మహేశ్‌ సరసన మిస్‌ ఇండియా మీనాక్షి చౌదరి నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఇచట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే రవితేజ ‘ఖిలాడీ’ చిత్రంలో నటించే ఛాన్స్‌ కొట్టేసింది. ఇప్పుడు ఏకంగా సూపర్‌స్టార్ సరసన అవకాశం రావడాన్ని బట్టి త్వరలోనే ఈ అమ్మడు తెలుగు చిత్రసీమను ఏలుతుందని సినీ పండితులు అంటున్నారు.

త్రివిక్రమ్- మహేశ్ మూవీలో హీరోయిన్‌గా మిస్ ఇండియా...!!

ఇంకో విషయం ఏంటంటే.. త్రివిక్రమ్ సినిమాలో మీనాక్షి సెకండ్ హీరోయిన్ అట. ఈ చిత్రంలో మెయిన్‌ హీరోయిన్‌గా పూజ హెగ్డే పేరు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా మీనాక్షిని ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘సలార్‌’లో సెకండ్‌ హీరోయిన్‌గా తీసుకుంటున్నట్లు కూడా వార్తలు వినిపించాయి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Related Videos