close
Choose your channels

ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'మిఠాయి'

Monday, March 12, 2018 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

రెడ్ యాంట్స్ పతాకంపై కమల్ కమరాజు, రవివర్మ, రాహుల్ రామకృష్ణ,. ప్రియదర్శి తదితరులు మెయిన్ లీడ్ గా నటిస్తోన్న డార్క్ కామెడీ చిత్రం 'మిఠాయి'. ప్ర‌శాంత్‌కుమార్ ద‌ర్శ‌క నిర్మాణంలో సినిమా రూపొందుతోంది. ప్ర‌త్యేకంగా వికారాబాద్‌లో వేసిన సెట్‌లో ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్త‌య్యింది. అలాగే ఈ సినిమాతో పరిచయం కానున్న రాహి పోస్టర్ ను ఈ సందర్భం గా రిలీజ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా...చిత్ర ద‌ర్శ‌క నిర్మాత ప్ర‌శాంత్ వ‌ర్మ మాట్లాడుతూ "వికారాబాద్‌లో వేసిన స్పెష‌ల్ సెట్‌లో లిబ‌రేష‌న్ సాంగ్‌ను చిత్రీక‌రించాం. దీంతో ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్త‌య్యింది. ఈ నెల 17న సినిమా రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. 'పెళ్ళిచూపులు' సినిమాకు సంగీతం అందించిన వివేక్ సాగ‌ర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండ‌టం విశేషం. డార్క్ కామెడి జోన‌ర్‌లో విభిన్నమైన క్యారెక్ట‌ర్స్ న‌డుమ సాగే సినిమా ఇది. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించి మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం" అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగ‌ర్‌, కెమెరా: సాకేత్ సౌర‌భ్‌, ఎడిటింగ్‌: వీను భూష‌ణ్ వెయిడ్‌, కొరియోగ్ర‌ఫీ: అని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కృష్ణ వోడ‌ప‌ల్లి.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.