close
Choose your channels

పంజాగుట్ట పీఎస్‌లో క్యాబ్ డ్రైవర్‌పై ముమైత్ ఫిర్యాదు..

Friday, October 2, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

పంజాగుట్ట పీఎస్‌లో క్యాబ్ డ్రైవర్‌పై ముమైత్ ఫిర్యాదు..

సినీ నటి ముమైత్ ఖాన్ తనకు డబ్బులు ఎగ్గొట్టారంటూ ఇటీవల క్యాబ్ డ్రైవర్ రాజు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా ముమైత్ స్పందించారు. డబ్బుల కోసం క్యాబ్ డ్రైవర్ రాజు తనను బ్లాక్ మెయిన్ చేస్తున్నాడంటూ పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు రాజుపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తాను రాజుకి ఇవ్వాల్సిన డబ్బులను పూర్తిగా చెల్లించానని.. అయినప్పటికీ తనను అతడు బెదిరింపులకు గురి చేస్తున్నాడని వాపోయారు. ఈ విషయమై తాను క్యాబ్ మేనేజర్‌తో పాటు కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేశానని ముమైత్ వెల్లడించింది. పేదవాడు అని వదిలేస్తే తనపైనే రివర్స్ అయిపోయి అసత్య ప్రచారం చేస్తున్నాడని.. దీంతో అతనిపై ఫిర్యాదు చేయక తప్పలేదని ముమైత్ తెలిపారు.

ఇటీవల క్యాబ్ డ్రైవర్ రాజు.. ముమైత్‌పై ఆరోపణలు గుప్పించాడు. మూడు రోజుల గోవా పర్యటన నిమిత్తం ముమైత్ కారు బుక్ చేసుకుందని... ఆ తరువాత మూడు రోజులను కాస్తా ఎనిమిది రోజుల పాటు పొడిగించిందని వెల్లడించింది. టోల్‌గేట్ నుంచి డ్రైవర్ అకామిడేషన్ వరకూ దేనికి డబ్బులు ఇవ్వలేదని రాజు ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా ముమైత్ తనకు 15 వేల రూపాయల వరకూ ఎగ్గొట్టిందని సోషల్ మీడియా వేదికగా వాపోయాడు. తనకు జరిగిన అన్యాయం మరో డ్రైవర్‌కు జరగకూడదని వెల్లడించాడు. ఈ ఘటనపై ముందుగా క్యాబ్ డ్రైవర్ అసోసియేషన్‌తో చర్చిస్తానని.. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తానని రాజు వెల్లడించాడు.టోల్‌గేట్ దగ్గర కట్టిన డబ్బులు తాలూకు రిసిప్ట్స్‌, ముమైత్‌తో కలిసిన దిగిన ఫొటోలు, ఆమెతో చేసిన వాట్సాప్ చాట్‌ను సైతం సోషల్ మీడియాలో రాజు షేర్ చేశాడు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.