close
Choose your channels

ఈ ఏడాది అభిమానులకు రెండు పండగ గిఫ్టులట

Friday, July 17, 2015 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అక్కినేని మూడు తరాలు వారు కలిసి చేసిన సినిమా మనం`. ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ సినిమా తర్వాత నాగార్జున మరో సినిమా చేయనేలేదు. కళ్యాణ కృష్ణ దర్శకత్వంలో అన్నపూర్ణ బ్యానర్ లో సొగ్గాడే చిన్ని నాయనా` సినిమా చేస్తున్నాడు. దీనితో పాటు పివిపి సంస్థలో కార్తీ, తమన్నాలతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం రెండు సినిమాలు చిత్రీకరణ దశలోనే ఉన్నాయి.

సొగ్గాడే చిన్నినాయనా` చిత్రాన్ని దసరాకి విడుదల చేయాలని నాగార్జున ప్లాన్ చేస్తున్నాడట. అలాగే పివిపి బ్యానర్ లో రూపొందుతోన్న చిత్రాన్ని క్రిస్ మస్ కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అంటే మొత్తం మీద అక్కినేని అభిమానులు, ప్రేక్షకులకు నాగార్జున రెండు పండుగ గిఫ్టులను అందించనున్నాడన్నమాట.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.